Political News

రూ.100 కోట్ల ‘మెగా’ ఆఫర్ కు షర్మిల నో!

తెలంగాణ రాష్ట్రంలో కాకలు తీరిన రాజకీయ నేతలు.. అధినేతలు ఉన్న వేళ.. వారందరికీ మించిన రీతిలో వైఎస్సార్ టీపీ అధినేత షర్మిల వ్యవహరించిందన్న మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని.. ఈ ప్రాజెక్టులో ఏకంగా రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందన్నది ఆమె వాదన. అంతేకాదు.. రూ.12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత మీదా ఆమె కంప్లైంట్లు చేస్తున్నారు.

కొత్త రాష్ట్రమైన తెలంగాణలో లక్ష కోట్లు దాచుకొని ఉద్యోగులకు టైంకు జీతాలు ఇవ్వలేని దీన స్థితికి మెగా సంస్థ కారణమైందన్న షర్మిల వాదన. అంతేకాదు.. మెగా దోచుడు మీద తాను మౌనంగా ఉంటే రూ.100 కోట్లు ఆఫర్ చేశారని.. దానిపై షర్మిల సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక్క షర్మిల తప్పించి.. మిగిలిన వారెవరూ ఈ మెగా దారుణాల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్న దానిపైనా సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు నెలవారీగా జీతాలు ఇస్తారని.. తామిచ్చే ఫండ్ తోనే రాజకీయ పార్టీలు నడిచేదన్న విషయాన్ని తనకు చెప్పినట్లుగా షర్మిల.. తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తమ వార్తలు మరే మీడియాలోనూ రాకుండా ఉండటానికి భారీ ఎత్తున మేనేజ్ చేస్తున్నట్లుగా షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే తమ కుంభకోణాలకు సంబంధించిన ఏ వార్తలు ఏ మీడియాలోనూ రావన్న ధీమాను ఆమె వద్ద వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

కాళేశ్వరం విషయంలో మౌనంగా ఉంటే మంచిదని షర్మిలకు సూచన చేయటం.. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. వదిలేదే లేదన్న విషయాన్ని తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మళ్లీ ఢిల్లీకి వెళ్లి.. కాళేశ్వరం మీద మరోసారి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. కాళేశ్వరం పాపాల పుట్ట పగలటం మొదలైతే.. మెగా దారుణాలు మరిన్ని బయటకు వస్తాయంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 22, 2022 10:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago