Political News

వైసీపీలో ఆందోళన !

వైసీపీ అంటే.. అప్ర‌క‌టిత క్ర‌మ శిక్ష‌ణ‌కు పెట్టింది పేరు. పైకి అంతా సాధార‌ణంగా ఉంటుంది. కానీ.. అధినేత అంటే.. అప‌రిమిత‌మైన గౌరవం.. ఆ మాటున భ‌యం కూడా ఉంది. పైకి మీడియా ముందుకు వ‌చ్చి.. ఎన్ని మాట్లాడినా.. అధినేత ముందుకు వెళ్లే స‌రికిమాత్రం చేతులు క‌ట్టుకుని.. నిల‌బ‌డి మాట్లాడాల్సిన ప‌రిస్థితి! దీనిపై గతంలోనే అనేక వివాదాలు.. వ‌చ్చాయి. సీనియ‌ర్ నాయ‌కుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో ఇదే విష‌యాన్ని చెప్పారు. “జ‌గ‌న్ వ‌య‌సు ఎంతండి. మా ఇంటికి వ‌చ్చి.. అన్నీ పాడుచేసేవాడు. ఇప్పుడు నేను ఆయ‌న ముందు నిల‌బ‌డాల్న‌.. చేతులు క‌ట్టుకోవాల్నా?” అంటూ.. ఆయ‌న రుస రుస‌లాడిన వీడియో.. అప్ప‌ట్లో జోరుగా వైర‌ల్ అయింది.

అలాంటి అత్యంత క్ర‌మ శిక్ష‌ణ ఉన్న పార్టీలో ఇప్పుడు నేత‌లు.. దారి త‌ప్పేస్తున్నారు. అధినేత జ‌గ‌న్‌పై అపార గౌర‌వం కాస్తా.. క‌నీస గౌర‌వంగా మారిపోతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి కార‌ణం. పార్టీ అదినేత చేస్తున్న ప‌నులు.. తీసుకుంటున్న నిర్ణ‌యాలే కార‌ణంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌భుత్వం కానీ… సీఎం జ‌గ‌న్ కానీ.. తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాల‌కు దారితీస్తున్నాయి. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి వెళ్తే.. ప్ర‌జ‌లు స‌మ‌స్య‌ల చిట్టాల‌ను విప్పుతున్నారు. ఇక‌, ఎక్క‌డ ప్ర‌సంగించినా.. రాష్ట్ర స‌మ‌స్య‌లు క‌నిపిస్తున్నాయి. వాటిని ప్ర‌స్తావించ‌కుండా.. మాట్లాడ‌లేని ప‌రిస్థితి.

ఇవి ఇలా.. ఉంటే.. ప్ర‌జ‌ల‌కు సెంటిమెంటుగా మారిన కొన్ని అంశాల‌పైనా.. ప్ర‌భుత్వం తీవ్ర వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకుంటోంది. దీంతో నాయ‌కులు స‌మాధానం చెప్పుకోలేక పోతున్నారు. ఇప్పుడు.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో.. సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై.. వైసీపీ నాయ‌కులే.. తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మార్పు మంచిదే అయినా.. ప‌రాయి.. వ్య‌క్తుల జోలికి పోవ‌డం.. ప్ర‌జ‌ల్లో సెంటిమెంటుగా ఉన్న అంశాల‌ను కెల‌క‌డం ఎందుక‌ని.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయాలు చేయొచ్చ‌ని.. కానీ.. అవి కొంత‌వ‌రకు ఉండాల‌ని.. నాయ‌కులు సూచిస్తున్నారు.

“మా అధినేత చేస్తున్న ప‌నుల‌తో మేం త‌ల ఎత్తుకోలేక పోతున్నాం. మా ఖ‌ర్మ‌.. మ‌రో అవ‌కాశం లేదు” అని.. సీమ ప్రాంతానికే చెందిన ఒక నాయ‌కుడు.. వ్యాఖ్యానించారు. ఈయ‌న ఒక్క‌రే కాదు.. దాదాపు స‌గం మంది ఎమ్మెల్యేలు.. కొన్ని నిర్ణ‌యాల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పును మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని త‌ప్పు.. అని చెప్ప‌లేం. కానీ.. త‌ప్పే..! మ‌న‌కు ఎందుకు? అనేక సంస్థ‌లు ఉన్నాయి.. వాటి పేరు మార్చి పెట్టుకోవ‌చ్చు క‌దా! అని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప‌రిణామాల‌పైనా.. కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. “మ‌న నాయ‌కులే బూతులు మాట్లాడారు. అప్పుడు కంట్రోల్ చేసుకుని ఉంటే గౌర‌వంగా ఉండి” అని కొంద‌రు అంత‌ర్గ‌త సంభాష‌ణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తీరు ముందు ముందు పెరిగితే.. పార్టీపై గౌర‌వం స‌న్న‌గిల్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 22, 2022 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

54 minutes ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

1 hour ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

1 hour ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

3 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

3 hours ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

5 hours ago