Political News

ఎత్తుకు పై ఎత్తు.. బీజేపీ గుండెల్లో ‘కారు’ ప‌రుగులు!!

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ధీమాతో ఉన్న బీజేపీ నేతలకు అధికార టీఆర్ఎస్ పార్టీ షాకులిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్ వ్యూహంలో బీజేపీ చిక్కుకుందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో బీసీ సామాజికవర్గం అజెండాతో బీజేపీ ముందుకుపోతోంది. ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుని కమలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వరుసగా బీజేపీకి ఆ పార్టీ నేతలు గుడ్‌బై చెబుతున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో కలవరం మొదలైంది. గురువారం భిక్షమయ్య గౌడ్, నేడు దాసోజు, స్వామిగౌడ్‌ బీజేపీకి రాజీనామా చేశారు. మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బీసీ నేతలు దూరమవుతున్నారు.

అలాగే జితేందర్ రెడ్డి, విఠల్, ఏనుగు రవీందర్ రెడ్డిలు బీజేపీని వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని సదరు నేతలు ఖండించారు. మాజీమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌లకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. దిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ అధిష్టానం దిగింది. పార్టీని వీడొద్దంటూ నేతలను అధిష్టానం బుజ్జగిస్తోంది. మ‌రోవైపు మునుగోడు ఉప ఎన్నికలో గౌడ సామాజిక వర్గ ఓట్లు కీలకంగా మారడంతో టీఆర్ఎస్‌, బీజేపీ పోటాపోటీ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.

మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ను చేర్చుకుని బీజేపీ పైచేయి సాధించగా.. వెంటనే రంగంలోకి దిగిన టీఆర్ఎస్‌ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే గౌడ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీపీ పల్లె జ్యోతితో పాటు ఆమె భర్త పల్లె రవికుమార్‌గౌడ్‌ను పార్టీలో చేర్చుకుంది. మాజీ ఎంపీ స్థాయి నేత బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్‌ బలహీనపడిందన్న భావన ప్రజల్లో లేకుండా ఉండేందుకు… అదే సామాజిక వర్గానికి చెందిన బూడిద బిక్షమయ్యగౌడ్‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇదిలావుంటే, బీజేపీ సైతం మునుగోడులో గౌడగర్జన సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలా చూసుకున్నా రెండు పార్టీలు వ్యూహ ప్ర‌తి వ్యూహాల‌తో ముందుకు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 21, 2022 7:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

4 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

4 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

6 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

6 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago