మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే దాసోజు శ్రవణ్ పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం.
ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పంపినట్లు తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందంటూ లేఖలో దాసోజు పేర్కొన్నారు. దశ దిశ లేని రాజకీయ పరిణామాలకు బీజేపీ వేదిక అవుతోందని తన లేఖలో దాసోజు ఘాటుగా విమర్శించారు. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్లో అధికారికంగా చేరనున్నట్టు శ్రవణ్ అనుచరులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో కాంగ్రెస్ను వీడి.. తరుణ్ చుగ్, కిషన్రెడ్డి, పలువురు కీలక నేతల సమక్షంలో బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆ సమయంలో తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకుని కారెక్కుతుండడం గమనార్హం.
ఇంతకీ దాసోజు రాసిన లేఖలో కీలక అంశాలు ఇవీ..
This post was last modified on October 21, 2022 2:07 pm
బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…
గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ‘పెద్ది’ దగ్గర్నుంచి ప్రతి రెండు వారాలకూ ప్రేక్షకులను అలరించే సినిమా పడుతోంది.…
తెలుగులో ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకుడు సూర్య. చాలా ఏళ్ల…
ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ…
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ చాలా ఒత్తిడిలో ఉంది కానీ ప్యారడైజ్ మీద క్షేత్ర స్థాయిలో ఎంత బజ్…
గత కొన్ని నెలలుగా తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి గురించి జోరుగా ఊహాగానాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.…