రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు దాటిపోయినా.. ఓ పదికిలోమీటర్ల మేరైనా.. రహదారులు నిర్మించ లేదని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు.. కనీసం.. దెబ్బతిన్న రోడ్లను కూడా.. బాగుచేయలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నాయి. అయితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా.. కొందరు మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారే తప్ప.. రహదారుల దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వర్షాలకు.. అనేక ప్రాంతాల్లోరోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినా.. పట్టించుకోలేదు.
రోడ్లపైనిలువెత్తు గుంతలు పడి.. చెరువులను తలపిస్తున్నాయని ప్రతిపక్షాలు.. ఫొటోలు వీడియోలతో సహా.. విమర్శలు చేస్తున్నా.. సర్కారు పట్టించు కోవడం లేదు. జనసేన, టీడీపీ నేతలు.. ఆయా గుంతల్లో స్నానాలు చేసి.. చేపలు పట్టి వినూత్న రీతిలో నిరసనలు తెలిపినా.. సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నాయకుడు.. జగన్ అంటే.. ప్రాణం పెట్టే నేత, విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే(ఇటీవల మూడు రాజధానులకు అనుకూలంగా రాజీనామా చేశారు) కరణం ధర్మశ్రీ.. రోడ్ల దుస్థితిపై విరుచుకుపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వని.. నేతల్లో ధర్మశ్రీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీలో సీఎం జగన్పై పద్యాలు.. పాడుతూ.. కవితలు చెబుతూ.. పొగడడంతో ఆయనకు ఆయనే సాటి. అలాంటి నాయకుడు.. తాజాగా ఓ ఫోన్లో మాట్లాడుతూ.. సర్కారు తీరుపై విమర్శలు చేశారు. బూతులు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్పై విరుచుకుపడ్డారు. తనను ప్రజలు ఆపేశారని.. మట్టి రోడ్లు వేస్తే.. ఎవరికి ప్రయోజనం’అని.. వాడు(సీఎం కావొచ్చు) డబ్బులు ఇవ్వట్లేదని.. వీళ్లని(ప్రజలను) ఇబ్బంది పెడితే.. మాకు తడిచిపోతోంది! అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. రాష్ట్రంలో రహదారులపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. జగన్ వింటారో లేదో చూడాలి.
This post was last modified on October 21, 2022 6:37 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…