రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు దాటిపోయినా.. ఓ పదికిలోమీటర్ల మేరైనా.. రహదారులు నిర్మించ లేదని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు.. కనీసం.. దెబ్బతిన్న రోడ్లను కూడా.. బాగుచేయలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నాయి. అయితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా.. కొందరు మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారే తప్ప.. రహదారుల దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వర్షాలకు.. అనేక ప్రాంతాల్లోరోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినా.. పట్టించుకోలేదు.
రోడ్లపైనిలువెత్తు గుంతలు పడి.. చెరువులను తలపిస్తున్నాయని ప్రతిపక్షాలు.. ఫొటోలు వీడియోలతో సహా.. విమర్శలు చేస్తున్నా.. సర్కారు పట్టించు కోవడం లేదు. జనసేన, టీడీపీ నేతలు.. ఆయా గుంతల్లో స్నానాలు చేసి.. చేపలు పట్టి వినూత్న రీతిలో నిరసనలు తెలిపినా.. సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నాయకుడు.. జగన్ అంటే.. ప్రాణం పెట్టే నేత, విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే(ఇటీవల మూడు రాజధానులకు అనుకూలంగా రాజీనామా చేశారు) కరణం ధర్మశ్రీ.. రోడ్ల దుస్థితిపై విరుచుకుపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వని.. నేతల్లో ధర్మశ్రీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీలో సీఎం జగన్పై పద్యాలు.. పాడుతూ.. కవితలు చెబుతూ.. పొగడడంతో ఆయనకు ఆయనే సాటి. అలాంటి నాయకుడు.. తాజాగా ఓ ఫోన్లో మాట్లాడుతూ.. సర్కారు తీరుపై విమర్శలు చేశారు. బూతులు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్పై విరుచుకుపడ్డారు. తనను ప్రజలు ఆపేశారని.. మట్టి రోడ్లు వేస్తే.. ఎవరికి ప్రయోజనం’అని.. వాడు(సీఎం కావొచ్చు) డబ్బులు ఇవ్వట్లేదని.. వీళ్లని(ప్రజలను) ఇబ్బంది పెడితే.. మాకు తడిచిపోతోంది! అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. రాష్ట్రంలో రహదారులపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. జగన్ వింటారో లేదో చూడాలి.
This post was last modified on October 21, 2022 6:37 am
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…
మన నిర్మాతలు ఈ మధ్య బౌండరీలు దాటేసి, వేరే ఇండస్ట్రీల సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్…