Political News

అమ‌రావ‌తి రైతుల‌కు మ‌రో షాక్‌

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వైసీపీ స‌ర్కారు ఇక్క‌డి రైతుల‌కు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాద‌ని ముందుకే సాగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్ట‌బడి ఉన్నామ‌న్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రాజ‌ధాని కోసం.. ఇక్క‌డి రైతులు త‌మ సాగు భూముల‌ను ఇచ్చిన నేప‌థ్యంలో వాటిని రాజ‌ధాని కోసం వినియోగించాల్సి ఉంది.

అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం కింద‌.. ఇక్క‌డ పేద‌ల‌కు భూములు కేటాయించింది. అయితే.. దీనిపై హైకోర్టులో గ‌తంలోనే పిటిష‌న్లు ప‌డ్డాయి. రాజ‌ధాని కోసం.. తీసుకున్న భూముల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు ఎలా మ‌ళ్లిస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు వేయొద్ద‌ని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం త‌ను అనుకున్న‌ది చేసేందుకే మొగ్గు చూపింది.

ఈ క్ర‌మంలో చ‌ట్టంలోని కొన్ని క్లాజులు మారుస్తూ.. తీసుకున్న నిర్ణ‌యానికి.. ఇప్పుడుగ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్ర‌కారం.. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ..గవర్నర్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ అయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మ‌రి దీనిపై రైతులు ఏమంటారో చూడాలి.

Satya

Recent Posts

ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఎలా ఉన్నారు..?

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…

7 minutes ago

మాట నిలబెట్టుకున్న AR రెహమాన్

అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…

3 hours ago

బండ్ల గణేష్ ఫైర్.. ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్

సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యేకించి…

3 hours ago

దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్‌!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన మంత్రిగా ఇప్ప‌టి వ‌ర‌కు…

4 hours ago

పది మెట్లు ఎక్కేసిన రామ్ చరణ్

పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…

4 hours ago

కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…

5 hours ago