రాజధాని అమరావతి విషయంలో ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వైసీపీ సర్కారు ఇక్కడి రైతులకు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాదని ముందుకే సాగుతోంది. మూడు రాజధానులకు కట్టబడి ఉన్నామన్న వైసీపీ ప్రభుత్వం.. ఈ క్రమంలో రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాజధాని కోసం.. ఇక్కడి రైతులు తమ సాగు భూములను ఇచ్చిన నేపథ్యంలో వాటిని రాజధాని కోసం వినియోగించాల్సి ఉంది.
అయితే.. వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల పథకం కింద.. ఇక్కడ పేదలకు భూములు కేటాయించింది. అయితే.. దీనిపై హైకోర్టులో గతంలోనే పిటిషన్లు పడ్డాయి. రాజధాని కోసం.. తీసుకున్న భూములను ఇతర పథకాలకు ఎలా మళ్లిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు వేయొద్దని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ ప్రభుత్వం తను అనుకున్నది చేసేందుకే మొగ్గు చూపింది.
ఈ క్రమంలో చట్టంలోని కొన్ని క్లాజులు మారుస్తూ.. తీసుకున్న నిర్ణయానికి.. ఇప్పుడుగవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం.. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ..గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు మాస్టర్ప్లాన్లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మరి దీనిపై రైతులు ఏమంటారో చూడాలి.
This post was last modified on October 21, 2022 12:35 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…