Political News

అమ‌రావ‌తి రైతుల‌కు మ‌రో షాక్‌

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న వైసీపీ స‌ర్కారు ఇక్క‌డి రైతుల‌కు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాద‌ని ముందుకే సాగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు క‌ట్ట‌బడి ఉన్నామ‌న్న వైసీపీ ప్ర‌భుత్వం.. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. రాజ‌ధాని కోసం.. ఇక్క‌డి రైతులు త‌మ సాగు భూముల‌ను ఇచ్చిన నేప‌థ్యంలో వాటిని రాజ‌ధాని కోసం వినియోగించాల్సి ఉంది.

అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కం కింద‌.. ఇక్క‌డ పేద‌ల‌కు భూములు కేటాయించింది. అయితే.. దీనిపై హైకోర్టులో గ‌తంలోనే పిటిష‌న్లు ప‌డ్డాయి. రాజ‌ధాని కోసం.. తీసుకున్న భూముల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు ఎలా మ‌ళ్లిస్తార‌ని హైకోర్టు ప్ర‌శ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు వేయొద్ద‌ని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం త‌ను అనుకున్న‌ది చేసేందుకే మొగ్గు చూపింది.

ఈ క్ర‌మంలో చ‌ట్టంలోని కొన్ని క్లాజులు మారుస్తూ.. తీసుకున్న నిర్ణ‌యానికి.. ఇప్పుడుగ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్ర‌కారం.. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ..గవర్నర్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ అయింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. మ‌రి దీనిపై రైతులు ఏమంటారో చూడాలి.

This post was last modified on October 21, 2022 12:35 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago