రాజధాని అమరావతి విషయంలో ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వైసీపీ సర్కారు ఇక్కడి రైతులకు తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై హైకోర్టు రూలింగ్ ఉన్నా.. కాదని ముందుకే సాగుతోంది. మూడు రాజధానులకు కట్టబడి ఉన్నామన్న వైసీపీ ప్రభుత్వం.. ఈ క్రమంలో రాజధాని అమరావతిలో నిర్మాణాలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే.. రాజధాని కోసం.. ఇక్కడి రైతులు తమ సాగు భూములను ఇచ్చిన నేపథ్యంలో వాటిని రాజధాని కోసం వినియోగించాల్సి ఉంది.
అయితే.. వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల పథకం కింద.. ఇక్కడ పేదలకు భూములు కేటాయించింది. అయితే.. దీనిపై హైకోర్టులో గతంలోనే పిటిషన్లు పడ్డాయి. రాజధాని కోసం.. తీసుకున్న భూములను ఇతర పథకాలకు ఎలా మళ్లిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలాంటి అడుగులు ముందుకు వేయొద్దని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ ప్రభుత్వం తను అనుకున్నది చేసేందుకే మొగ్గు చూపింది.
ఈ క్రమంలో చట్టంలోని కొన్ని క్లాజులు మారుస్తూ.. తీసుకున్న నిర్ణయానికి.. ఇప్పుడుగవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం.. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాల సవరణకు ఆమోదముద్ర వేస్తూ..గవర్నర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఇళ్ల పథకాలు రాజధాని ప్రాంతంలోని వారికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోని అర్హులకు కూడా కేటాయించేలా కొద్దినెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ విషయంలో సంబంధిత పాలకవర్గంతో పాటు ప్రత్యేకాధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్టాన్ని సవరించింది. దీంతో పాటు మాస్టర్ప్లాన్లో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మరి దీనిపై రైతులు ఏమంటారో చూడాలి.
This post was last modified on October 21, 2022 12:35 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…