కేసీయార్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన జరుగుతోందట. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహణతో పార్టీని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని కేసీయార్ అనుకున్నారు. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల్లో విశాఖనే బెస్ట్ ప్లేస్ అని కేసీయార్ డిసైడ్ అయ్యారట.
ఉత్తరాంధ్రలో కేసీయార్ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి బహిరంగ సభ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సామాజికవర్గం ఉన్నంత మాత్రాన బహిరంగసభలు సక్సెస్ అవుతాయా అంటే ఎవరు చెప్పలేరు. అందుకనే సభకు ముందుగానే కొందరు నేతలను అక్కడికి పంపి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా తొందరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో టూర్ చేయబోతున్నట్లు సమాచారం.
బహిరంగసభ జరిగేలోపే ఏపీలోని సీనియర్ నేతల్లో బీఆర్ఎస్ లో చేరేవాళ్ళకోసం గాలమేస్తున్నారట. ఉత్తరాంధ్రలోని మాజీమంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుతో పాటు కడపలోని డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా ఇప్పటికే తలసాని మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళే కాకుండా మరికొందరితో కూడా తలసాని మాట్లాడుతున్నారట. ఇదే సమయంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే మరికొందరితో కేసీయార్ మాట్లాడారట.
బహిరంగ సభ స్థలం, తేదీ నిర్ణయమయ్యేలోగా పార్టీలో చేరే నేతలు కూడా ఫైనల్ అవ్వాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనకు కారుకుడు, ఏపీ ఇబ్బందుల్లో ఉండటానికి ప్రధాన కారకుడైన కేసీయార్ పార్టీకి ఏపిలో ఆదరణ ఉంటుందా అనేది పెద్ద సందేహం. విభజన ఉద్యమం సమయంలో కానీ తర్వాత కూడా ఏపీ గురించి కేసీయార్ ఎంత చీపుగా మాట్లాడారు, ఎంత ఘోరంగా తిట్టారనే విషయాన్ని ఎవరు మరచిపోలేకుండా ఉన్నారు. మరీ పరిస్థితుల్లో కేసీయార్ ఏ ధైర్యంతో ఏపీలో తన పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…