Political News

KCR మొదటి మీటింగ్ విశాఖలోనేనా?

కేసీయార్ ఆధ్వర్యంలో జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచన జరుగుతోందట. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీలో బహిరంగ సభ నిర్వహణతో పార్టీని గ్రాండ్ గా లాంఛ్ చేయాలని కేసీయార్ అనుకున్నారు. విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ బహిరంగ సభ పెట్టాలని అనుకున్నారు. అయితే తాజా పరిణామాల్లో విశాఖనే బెస్ట్ ప్లేస్ అని కేసీయార్ డిసైడ్ అయ్యారట.

ఉత్తరాంధ్రలో కేసీయార్ సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి బహిరంగ సభ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సామాజికవర్గం ఉన్నంత మాత్రాన బహిరంగసభలు సక్సెస్ అవుతాయా అంటే ఎవరు చెప్పలేరు. అందుకనే సభకు ముందుగానే కొందరు నేతలను అక్కడికి పంపి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా తొందరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో టూర్ చేయబోతున్నట్లు సమాచారం.

బహిరంగసభ జరిగేలోపే ఏపీలోని సీనియర్ నేతల్లో బీఆర్ఎస్ లో చేరేవాళ్ళకోసం గాలమేస్తున్నారట. ఉత్తరాంధ్రలోని మాజీమంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావుతో పాటు కడపలోని డీఎల్ రవీంద్రారెడ్డితో కూడా ఇప్పటికే తలసాని మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. వీళ్ళే కాకుండా మరికొందరితో కూడా తలసాని మాట్లాడుతున్నారట. ఇదే సమయంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే మరికొందరితో కేసీయార్ మాట్లాడారట.

బహిరంగ సభ స్థలం, తేదీ నిర్ణయమయ్యేలోగా పార్టీలో చేరే నేతలు కూడా ఫైనల్ అవ్వాలని కేసీయార్ పట్టుదలగా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనకు కారుకుడు, ఏపీ ఇబ్బందుల్లో ఉండటానికి ప్రధాన కారకుడైన కేసీయార్ పార్టీకి ఏపిలో ఆదరణ ఉంటుందా అనేది పెద్ద సందేహం. విభజన ఉద్యమం సమయంలో కానీ తర్వాత కూడా ఏపీ గురించి కేసీయార్ ఎంత చీపుగా మాట్లాడారు, ఎంత ఘోరంగా తిట్టారనే విషయాన్ని ఎవరు మరచిపోలేకుండా ఉన్నారు. మరీ పరిస్థితుల్లో కేసీయార్ ఏ ధైర్యంతో ఏపీలో తన పార్టీని విస్తరించాలని అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు.

This post was last modified on October 20, 2022 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

24 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

37 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago