Political News

జ‌న‌సేన‌లోకి క‌న్నా.. నేడో.. రేపో..?

ఏపీ బీజేపీలో కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ క‌మ‌లం గూటికి రాం రాం చెప్ప‌నున్నారు. తాజాగా జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు.. దీనికి ముందు నుంచి కూడా.. ఆయ‌న‌కు ఎదుర‌వుతున్న వ‌రుస ప‌రాభ‌వాల నేప‌థ్యంలో.. క‌న్నా.. పార్టీ మారేందుకు రెడీ అయ్యార‌ని తెలిసింది. రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్న కన్నా.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్య అనుచరులతో భేటీ అయినా.. పార్టీ మార్పుపై ఆయ‌న దృష్టి పెట్టారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు రాజ‌కీయంగా అచేత‌నంగా ఉన్న‌.. క‌న్నా.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఆశ‌తో.. ఆ పార్టీలో చేరారు. ఆయ‌న ను ఈ ప‌ద‌వి వ‌రించింది. అయితే.. పార్టీనిస‌రైన విధంగా.. ముందుకు న‌డిపించ‌లేక పోయాన‌ని.. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న త‌ర్వాత‌.. కాలంలో ఒప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌గ్గాలు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. పైగా.. అప్ప‌ట్టో ప‌ద‌విని ఆశించిన‌… ఒక కీల‌క కాపు నాయ‌కుడే.. త‌న‌కు అడుగ‌డుగునా.. అడ్డు త‌గిలార‌ని.. కూడా క‌న్నా చెప్పుకొచ్చేవారు.

గుంటూరు జిల్లాలోని పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా 5 సార్లు ఎమమ్మెల్యేగా గెలిచిన క‌న్నా..వైఎస్ హ‌యాంలో మంత్రి గా కూడా ప‌నిచేశారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌న‌.. వివాదర‌హితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న కుమారుడు గుంటూరు న‌గ‌ర మేయ‌ర్‌గా ప‌నిచేశారు. కాంగ్రెస్‌లో 30 ఏళ్ల అనుబంధం ఉన్న క‌న్నా.. రాష్ట్ర విభ‌జ‌న‌త‌ర్వాత కూడా.. పార్టీలో కొన‌సాగారు. అయితే.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. ఆయ‌న ప‌క్క చూపులు చూశారు. ఈ క్ర‌మంలో తొలుత వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది.

అయితే.. బీజేపీ రాష్ట్ర చీఫ్ ప‌ద‌వి ఇస్తాన‌న‌డంతో ఆయ‌న అటు మొగ్గారు. అయితే.. ఇప్పుడు.. సోము వీర్రాజు హ‌యాంలో క‌న్నాకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా.. జ‌న‌సేన‌లో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకున్న‌ట్టు తెలిసింది. ప‌వ‌న్‌తో చ‌నువు ఉన్న క‌న్నా.. గ‌తంలో మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ.. అనేక మార్లు.. ప‌వ‌న్‌తో త‌న ఛాంబ‌ర్‌లోనే భేటీ అయిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని అంటారు. ఈ క్ర‌మంలో ఆయ‌న \జ‌న‌సేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. క‌న్నా వంటి సీనియ‌ర్ నాయ‌కులు, మ‌చ్చ‌లేని నాయ‌కులు.. వ‌స్తానంటే.. ప‌వ‌న్ కాద‌న‌డు కాబ‌ట్టి..ఆయ‌న‌కు ఢోకాలేదు. సో.. దీనిపై ప్ర‌క‌ట‌నే త‌రువాయి అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on October 19, 2022 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago