వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో రెచ్చిపోయాడు జనసేనాని పవన్ కళ్యాన్ ఈ రోజు. పవన్లో ఇంత ఆవేశం ఉందా అనిపించేలా తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులను దునుమాడేశాడు. అలా అని ప్రజారాజ్యం టైంలో మాదిరి విషయం లేకుండా కేవలం ఆవేశాన్ని మాత్రమే ప్రదర్శించలేదు. పాయింట్ టు పాయింట్ పట్టుకుని వైసీపీ నేతల్ని టార్గెట్ చేశాడు. తనను ప్యాకేజీ స్టార్ అనే వాళ్లకు పవన్ ఈ రోజు దీటైన సమాధానమే చెప్పాడు. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక తన మీద తరచుగా మూడు పెళ్ళిళ్ళ విషయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టాడు పవన్. తాను లీగల్గా విడాకులతో పాటు భరణం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేంటి నొప్పి అని పవన్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా విడాకులు తీసుకున్నాక తన తొలి ఇద్దరు భార్యలకు ఏం ఇచ్చింది కూడా పవన్ వెల్లడించాడు.
“మాటక ముందు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటారు. మీరూ చేసుకోండ్రా ఎవరు కాదన్నారు. మీకు కూడా మీ భార్యతో కుదరకపోతే విడాకులు ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకోండి. నేను నా మొదటి భార్యకు భరణం కింద ఐదు కోట్ల భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నా. రెండో భార్యకు విడాకులిచ్చాక ఆస్తి రాసిచ్చా. ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నా. నేను విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నారా సన్నాసుల్లారా. ఒక్కర్ని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసుల్లారా మీకేంట్రా నేను చెప్పేది. ఎదవల్లారా” అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు పవన్.
మరోవైపు ప్యాకేజీ స్టార్ అనడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పవన్.. తన ఆదాయం లెక్కలు కూడా చెప్పారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. వాటి ద్వారా 100-120 కోట్ల దాకా ఆదాయం వచ్చిందని.. అందులోంచి రూ.33 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టానని.. రూ.12 కోట్లు పార్టీకి ఇచ్చానని పవన్ తెలిపాడు.
This post was last modified on October 18, 2022 4:49 pm
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి పరిస్థితి ఎలా ఉంది.. ఈ పార్టీ తరఫున కార్యక్రమాలు ఏ…
జూన్ 26 లెనిన్ విడుదల కావాలి. గతంలో మే 1 ఫిక్స్ చేసుకున్న డేట్ ని పెద్ది కోసం త్యాగం…
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…