ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు కేసీయార్ వెళ్ళి వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడేమో ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం అందరికీ తెలుసు. నామినేషన్లు వేసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తరపున కేసీయార్ కనీసం రెండు బహిరంగసభల్లో అయినా పాల్గొంటారని పార్టీ నేతలు అనుకున్నారు. అయితే కేసీయార్ అసలు రాష్ట్రంలోనే లేరు.
ఇదే అభ్యర్ధికి టెన్షన్ పెంచేస్తోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు లక్నో వెళ్ళారు. అట్నుంచి అటే ఢిల్లీకి వెళ్ళిపోయిన కేసీయార్ అక్కడే మకాం వేసున్నారు. రెండురోజులుగా జ్వరం కారణంగా ఎవరినీ కలవలేదంటున్నారు. మరి అంతకుముందు ఐదురోజులు ఏమిచేసినట్లు ? ఒకరోజు టీఆర్ఎస్ భవననిర్మాణాన్ని పర్వవేక్షించారు. మరి మిగిలిన రోజులంతా ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు.
పైగా సోమవరం మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచారశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించుకున్నారు. మరి ఏ అవసరమై వీళ్ళని పిలిపించుకున్నారో తెలీదు. ఢిల్లీ నుండే మునుగోడు ఉపఎన్నికను సమీక్షిస్తున్నారట. ఇలా ఫోన్లలో ఎన్నికల ప్రక్రియను సీఎం సమీక్షిస్తే పార్టీలో రావాల్సినంత ఊపురాదు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఢిల్లీ పిలిపించుకున్నారంటే అక్కడినుండి తిరిగి హైదరాబాద్ కు ఇప్పుడిప్పుడే రారనే ప్రచారమైతే మొదలైంది.
మరక్కడ కూర్చుని ఏమిచేస్తున్నారో, హఠాత్తుగా చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఎందుకు పిలిపించుకున్నారో ఎవరికీ అర్ధంకావటం లేదు. హైదరాబాద్ లో లేక ఢిల్లీలో ఉండే జాతీయపార్టీ నేతల ప్రముఖులతోను కలవక మరేం చేస్తున్నట్లు ? కేసీయార్ వెంబడి కూతురు, ఎంఎల్సీ కవిత కూడా ఉన్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు తరచూ వినబడుతోంది. బహుశా ఈ విషయంగానే ఢిల్లీలో మకాం వేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
This post was last modified on October 18, 2022 11:11 am
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం…
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్…
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు…
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన…
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు…