Political News

కేసీయార్ ఎవరికీ అర్ధం కారు

ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతోంది. మరోవైపు కేసీయార్ వెళ్ళి వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక్కడేమో ఉపఎన్నిక పోలింగ్ దగ్గరకు వచ్చేస్తోంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం అందరికీ తెలుసు. నామినేషన్లు వేసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తరపున కేసీయార్ కనీసం రెండు బహిరంగసభల్లో అయినా పాల్గొంటారని పార్టీ నేతలు అనుకున్నారు. అయితే కేసీయార్ అసలు రాష్ట్రంలోనే లేరు.

ఇదే అభ్యర్ధికి టెన్షన్ పెంచేస్తోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు లక్నో వెళ్ళారు. అట్నుంచి అటే ఢిల్లీకి వెళ్ళిపోయిన కేసీయార్ అక్కడే మకాం వేసున్నారు. రెండురోజులుగా జ్వరం కారణంగా ఎవరినీ కలవలేదంటున్నారు. మరి అంతకుముందు ఐదురోజులు ఏమిచేసినట్లు ? ఒకరోజు టీఆర్ఎస్ భవననిర్మాణాన్ని పర్వవేక్షించారు. మరి మిగిలిన రోజులంతా ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు.

పైగా సోమవరం మధ్యాహ్నం చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచారశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించుకున్నారు. మరి ఏ అవసరమై వీళ్ళని పిలిపించుకున్నారో తెలీదు. ఢిల్లీ నుండే మునుగోడు ఉపఎన్నికను సమీక్షిస్తున్నారట. ఇలా ఫోన్లలో ఎన్నికల ప్రక్రియను సీఎం సమీక్షిస్తే పార్టీలో రావాల్సినంత ఊపురాదు. చీఫ్ సెక్రటరీ, డీజీపీని ఢిల్లీ పిలిపించుకున్నారంటే అక్కడినుండి తిరిగి హైదరాబాద్ కు ఇప్పుడిప్పుడే రారనే ప్రచారమైతే మొదలైంది.

మరక్కడ కూర్చుని ఏమిచేస్తున్నారో, హఠాత్తుగా చీఫ్ సెక్రటరీ, డీజీపీలను ఎందుకు పిలిపించుకున్నారో ఎవరికీ అర్ధంకావటం లేదు. హైదరాబాద్ లో లేక ఢిల్లీలో ఉండే జాతీయపార్టీ నేతల ప్రముఖులతోను కలవక మరేం చేస్తున్నట్లు ? కేసీయార్ వెంబడి కూతురు, ఎంఎల్సీ కవిత కూడా ఉన్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు తరచూ వినబడుతోంది. బహుశా ఈ విషయంగానే ఢిల్లీలో మకాం వేశారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on October 18, 2022 11:11 am

Share
Show comments
Published by
satya

Recent Posts

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

2 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

2 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

3 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

4 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

5 hours ago

బాహుబలి బ్రాండు విలువ ఎప్పటిదాకా

టాలీవుడ్ గమనాన్ని ఆసాంతం మార్చిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం. అప్పటిదాకా మహా అయితే వంద…

5 hours ago