Political News

కేసీఆర్ ఏపీ టూర్‌… మూడుపై ఏం చెపుతారో!

త్వ‌ర‌లోనే తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. అందునా ఆయ‌న తొలిసభ విశాఖ లేదా విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర‌స‌మితి(టీఆర్ఎస్‌)ని భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌)గా మార్చిన ద‌రిమిలా.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే.. త్వ‌ర‌లోనే ఏపీతో ప్రారంభించి.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏపీపైనే ఎక్కువ‌గా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఏపీకి రావ‌డం అయితే తేలికే.. కానీ, ఇక్క‌డ ఏం చెబుతారు? ఆయ‌న వ్యూహాలు ఏంటి? అనేదే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యాలు.

ప్ర‌స్తుతం ఏపీలో అనేక అనేక స‌మ‌స్య‌లు తిష్ట‌వేశాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ.. జ‌ల వివాదాలు, ఉద్యోగ నియామ‌కాలు.. ఒక‌టా రెండా అనేక స‌మ‌స్య‌లు తాండవిస్తున్నాయి. మ‌రి వీటిని ప్ర‌స్తావించ‌కుండా.. కేసీఆర్ ఏం చెప్పినా.. ప్ర‌యోజ‌నం లేద‌నేది స్థానిక రాజ‌కీయ నేత ల‌మాట‌. పైగా.. తెలంగాణ నుంచి అనే క వివాదాలు ప‌రిష్కారం కావాల్సి ఉంది. వీటిపైనా.. సీఎం కేసీఆర్ ప్ర‌స్తావ‌న చేయాలి. అదేస‌మ‌యంలో వెనుక బ‌డిన జిల్లాలు, పోల‌వ‌రం ముంపు ప్రాంత మండ‌లాలు.. వంటివి స‌మ‌స్య‌ల‌కు కేంద్రంగా ఉన్నాయి. వీటిపైనా ఆయ‌న స్పంద‌న తెలియ జేయాలి. జాతీయ నేత‌గా ఆయ‌న వ‌చ్చి.. రెండు మాట‌లు చెప్పి వెళ్లిపోతే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మెచ్చుకునే ప‌రిస్థితి ఎంత మాత్రం లేదు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌స్తుతం కీల‌క‌మైన మూడు రాజ‌ధానుల విష‌యంపై కేసీఆర్ వ్యూహాన్ని కూడా వెల్ల‌డించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప‌రిదిలోని అంశ‌మే అయినా.. ఆయ‌న‌కు ఓట్లు కావాల‌న్నా.. ప్ర‌జ‌ల నుంచి జేజేలు కావాల‌న్నా.. త‌న అభిప్రాయాన్ని చెప్పితీరాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, జాతీయ పార్టీగా రాష్ట్రానికి ఏం చేస్తారో కూడా కేసీఆర్ వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు.. ఏపీకి సంబందించిన స‌మ‌స్య‌ల‌పై ఒక నోట్ త‌యారు చేసుకుంటున్నార‌ని.. వాటిలో సానుకూల అంశాలు.. ప్ర‌తికూల అంశాలు కూడా ఉన్నాయ‌ని.. వీటిపై కేసీఆర్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని అంటున్నారు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కేసీఆర్ రాజ‌కీయ వ్యూహం కూడా ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. కేసీఆర్ అంచ‌నా ప్ర‌కారం.. ఏపీ నుంచి సుమారు 50 మంది వ‌ర‌కు ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌ని.. తాజా లెక్క‌లు చెబుతున్నాయి. వాస్త‌వానికి బీఆర్ఎస్ పార్టీ క‌నుక లైన్‌లోకి వ‌స్తే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. చాలా మందికి టికెట్లు ద‌క్కే ప‌రిస్థితి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నిపించ‌డం లేదు. దీంతో అంతో ఇంతో ఆర్థికంగా బ‌లంగా ఉన్న నాయ‌కులు.. స్వ‌తంత్రంగా క‌న్నా.. ఏదో ఒక పార్టీ పేరుతో పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి బీఆర్ఎస్ అందివ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని,, దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటే స‌రిపోతుంద‌ని.. కేసీఆర్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

This post was last modified on October 18, 2022 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

8 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

45 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago