Political News

‘వైసీపీ విముక్త ఏపీ’నే మా నినాదం: ప‌వ‌న్

‘వైసీపీ విముక్త ఏపీ’నే ఇక నుంచి త‌న నినాద‌మ‌ని.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఏపీ నుంచి వైసీపీని త‌రిమికొట్టేందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ్తాన‌ని చెప్పారు. ఇది సాకారం అయ్యేవ‌ర‌కు.. తాను విశ్ర‌మించేది లేద‌న్నారు. విశాఖ నుంచి విజ‌య‌వాడ చేరుకున్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు.

“ఆంధ్రప్రదేశ్‌ నుంచే రాయలసీమకు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు. అంత మంది సీఎంలు వచ్చినా.. రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది. అధికారమంతా ఒక కుటుంబం చేతిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి విముక్తి పొందాలి. అంతకంటే వేరే మార్గం లేదు. క్రిమినల్‌ పొలిటికల్‌ మైండ్‌సెట్‌ ఉన్న నేతలను పరిపాలన వ్యవస్థ నుంచి దూరం చేయాలి. అది జరిగేంతవరకు ఏపీ అభివృద్ధి చెందదు” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

భవిష్యత్‌ తరానికి అది మంచిది కాదు. వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా జనసేన పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. వైసీపీ క‌బంద హ‌స్తాల‌ నుంచి ఏపీని విముక్తి చేయడమే మా లక్ష్యమ‌ని అన్నారు. వైసీపీని గద్దె దించడం ఖాయమ‌ని, ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందని అన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసమే వచ్చే ఎన్నికల్లో పోరాడతామ‌ని.. అప్ప‌టి వ‌ర‌కు నిద్ర‌పోన‌ని పవన్‌ వెల్లడించారు.

‘విశాఖలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కుట్ర చేశారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీసులు పని చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి చేసి విశాఖలో ఇబ్బంది పెట్టారు. వైసీపీ చేపట్టిన ‘విశాఖ గర్జన’ విఫలం కావడంతో మ‌మ‌ల్ని పోలీసులు అడ్డుకున్నారు. 105 మందిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది ముమ్మాటికీ దుర్మార్గమైన చర్య. ఒక పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం అప్రజాస్వామికం. కార్యకర్తలకు అభివాదం కూడా చేయొద్దని ఆంక్షలు విధించడం దారుణం. విశాఖ గర్జనకు లేని ఆంక్షలు జనవాణికే ఎందుకు వర్తిస్తాయి? రుషికొండ తవ్వకాలను పరిశీలించకుండా అనేక సార్లు అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు.

This post was last modified on October 17, 2022 9:27 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

8 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

11 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago