తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తొందరలోనే కొత్త చేరికలు ఊపందుకుంటాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు టీడీపీలో చేరటానికి చాలా ఆశక్తిగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణా సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా ఎవరొచ్చినా మనం చేర్చుకోవాల్సిందే అన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా మరో పదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్చే కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సూచించారు.
తెలంగాణాను టీడీపీ గతంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణాలోని ఏమూలకు వెళ్ళినా టీడీపీ చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటం వల్లే టీడీపీకి ఈ పరిస్దితి వచ్చిందని చంద్రబాబు బాదపడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాగా స్పీడుచేయాలన్నారు. ఎన్టీయార్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయనతో వచ్చిన విభేదాలను, పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను తాను ఒక టీవీ షోలో వివరించినట్లు చెప్పారు.
ఎన్టీయార్ ఆశయాల ప్రకారమే టీడీపీ పనిచేస్తుందని గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి తాను తొందరలోనే పర్యటనలు చేస్తానని గతంలోనే చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొందరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు ఆమధ్య ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఈమధ్య మాత్రం చంద్రబాబు తరచూ టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారంలో ఐదురోజులు తాను తెలంగాణా నేతలకు అందుబాటులో ఉంటానని ఈమధ్యనే చెప్పారు.
చంద్రబాబు మాటలు, ఆలోచనలు చూస్తుంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ యాక్టివ్ రోల్ పోషించాలని అనుకుంటున్నట్లుంది. అయితే అది సాధ్యమేనా అన్నదే అసలు ప్రశ్న. పార్టీనుండి చాలామంది నేతలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. నిజం చెప్పాలంటే తెలంగాణా నేతల్లో గట్టి నేతలు అనుకున్న వారే పెద్దగా లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో పార్టీకి పూర్వవైభం అంటే చాలా కష్టపడాలి. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే చెప్పలేం కానీ గెలిస్తే మాత్రం పూర్వవైభవం సాధ్యంకాదనే అనుకోవాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…