Political News

ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌పై స‌ర్కారు దూకుడు.. జ‌న‌సేనాని రియాక్ష‌న్ ఇదే!

విశాఖ ప‌ట్నం జిల్లాలో మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న ఆది నుంచి కూడా.. ఉత్కంఠ‌కు దారితీసింది. స‌ర్కారు ఈ ప‌ర్య‌ట‌న‌పై వెయ్యి క‌ళ్ల‌తో నిఘాను ఏర్పాటు చేసింద‌నే వాద‌న జ‌న‌సేన నుంచి వినిపిస్తోంది. నిన్న జ‌రిగిన గ‌ర్జ‌న స‌భ అనంత‌రం.. మంత్రులు, వైసీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారన్న ఆరోపణలతో పలువురు జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దాడికి యత్నించినవారిని గుర్తించి సెక్షన్‌ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.

మంత్రి రోజా, తదితర నాయకులు విమానాశ్రయానికి వచ్చినపుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడారని వెల్లడించారు. పెందుర్తి పోలీసుల సిబ్బంది, దిలీప్‌కుమార్‌, సిద్ధు, సాయికిరణ్‌, హరీష్‌ తదితరులకు బలమైన గాయాలయ్యాయన్నారు. కారకులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

మరోవైపు.. పోలీసులు రాత్రి పొద్దుపోయాక పవన్‌ బసచేస్తున్న నోవోటెల్‌ హోటల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో వ‌ప‌న్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందికి , పోలీసుల‌కు మ‌ధ్య వాద‌ప్ర‌తివాదాలు తీవ్ర‌స్థాయిలో చోటు చేసుకున్నాయి. అయినా.. పోలీసులు వారిని ప‌క్క‌కు నెట్టి.. హోట‌ల్‌ను త‌మ అధీనంలోకి తీసుకున్నారు. మ‌రోవైపు.. తమ పార్టీ నేతలైన సుందరపు విజయ్‌కుమార్‌, పీవీఎస్‌ఎన్‌ రాజులను అరెస్టు చేసినట్లు జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.

నేతలను విడుదల చేయకుంటే స్టేషన్‌కు వస్తా: పవన్‌

విశాఖలో పోలీసులు అరెస్టుచేసిన జనసేన నేతలను వెంటనే విడుదల చేయకుంటే పోలీసుస్టేషన్‌కు వచ్చి… వారికి సంఘీభావం ప్రకటిస్తానని పవన్‌కల్యాణ్‌ స్పష్టంచేశారు. ‘జేఎస్‌పీ ఎప్పుడూ రాష్ట్ర పోలీసు బలగాలను ఎంతో గౌరవిస్తోంది. అనవసరంగా అరెస్టు చేసిన మా పార్టీ నేతలను విడుదల చేయించాలని డీజీపీని కోరుతున్నా’ అని ప‌వ‌న్‌ ట్వీట్ చేశారు. మ‌రిదీనిపై పోలీసులు ఎలారియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on October 17, 2022 12:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

42 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago