వైసీపీ మంత్రులు, నాయకులు.. తరచుగా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు.. తనపై చేస్తున్న విమర్శలు సిల్లీగా ఉన్నాయని అన్నారు. తను మూడు పెళ్లిళ్లు చేసుకు న్నానని.. పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని.. ఇది సరికాదని.. హుందాగా కూడా ఉండదని అన్నారు. అంత సరదాగా ఉంటే.. వైసీపీ నాయకులు కూడా.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న వాళ్లకు విడాకులు ఇచ్చి.. చేసుకోండి! అని సటైర్లు వేశారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నావు.. మూడు రాజధానులు ఉంటే తప్పేంటి? అని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇది సరైన లాజిక్ కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. మీకెందుకు అంత బాధ. మీరు కూడా చేసుకోండి అని అన్నారు. ఇదిలావుంటే.. విశాఖను వదిలి వెళ్లాలని.. పోలీసులు పవన్కు సూచించినట్టు తెలిసింది. ఆయన విశాఖలోనే ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని వారు సూచించినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్.. ఆదివారం విశాఖలో నిర్వహించాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
చంద్రబాబు ఫైర్..
మరోవైపు.. జనసేన కార్యకర్తల అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే పవన్ పర్యటనను అడ్డుకుందని.. కావాలనే పోలీసులను పంపించి తనఖీలు చేయించిందని అన్నారు. ఎదుటి పార్టీ వాళ్లు ఏం చేయాలో.. కూడా.. అధికార పార్టీనే డిసైడ్ చేస్తుందా? అని ప్రశ్నించారు. జనాలకు ప్రయోజనకరంగా ఉన్న జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు ఇలా చేస్తున్నారని.. చంద్రబాబు మండిపడ్డారు. ఈ పరిణామాలను గమనిస్తే.. నియంత పాలనకు పరాకాష్టగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 16, 2022 1:42 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…