Political News

మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి: ప‌వ‌న్

వైసీపీ మంత్రులు, నాయ‌కులు.. త‌ర‌చుగా త‌న‌పై చేస్తున్న వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. తాజాగా విశాఖ‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. వైసీపీ నాయ‌కులు.. త‌న‌పై చేస్తున్న విమ‌ర్శ‌లు సిల్లీగా ఉన్నాయ‌ని అన్నారు. త‌ను మూడు పెళ్లిళ్లు చేసుకు న్నాన‌ని.. ప‌దే ప‌దే వ్యాఖ్యానిస్తున్నార‌ని.. ఇది స‌రికాద‌ని.. హుందాగా కూడా ఉండ‌ద‌ని అన్నారు. అంత స‌ర‌దాగా ఉంటే.. వైసీపీ నాయ‌కులు కూడా.. మూడు పెళ్లిళ్లు చేసుకోవాల‌ని అన్నారు. ఇప్పుడున్న వాళ్ల‌కు విడాకులు ఇచ్చి.. చేసుకోండి! అని స‌టైర్లు వేశారు.

మూడు పెళ్లిళ్లు చేసుకున్నావు.. మూడు రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంటి? అని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఇది స‌రైన లాజిక్ కాదు అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాన‌ని.. మీకెందుకు అంత బాధ‌. మీరు కూడా చేసుకోండి అని అన్నారు. ఇదిలావుంటే.. విశాఖ‌ను వ‌దిలి వెళ్లాల‌ని.. పోలీసులు ప‌వ‌న్‌కు సూచించిన‌ట్టు తెలిసింది. ఆయ‌న విశాఖ‌లోనే ఉంటే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉంటుంద‌ని వారు సూచించిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్‌.. ఆదివారం విశాఖ‌లో నిర్వ‌హించాల్సిన జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసుకున్నారు.

చంద్ర‌బాబు ఫైర్‌..

మ‌రోవైపు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల అరెస్టును టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఖండించారు. ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంద‌ని.. కావాల‌నే పోలీసులను పంపించి త‌న‌ఖీలు చేయించింద‌ని అన్నారు. ఎదుటి పార్టీ వాళ్లు ఏం చేయాలో.. కూడా.. అధికార పార్టీనే డిసైడ్ చేస్తుందా? అని ప్ర‌శ్నించారు. జ‌నాల‌కు ప్ర‌యోజ‌న‌కరంగా ఉన్న జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని అడ్డుకోవాల‌నే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయ‌కులు ఇలా చేస్తున్నార‌ని.. చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నియంత పాల‌న‌కు ప‌రాకాష్ట‌గా ఉంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

This post was last modified on October 16, 2022 1:42 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago