ప్రతిపక్షాలకు చోటు లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు. ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాను అధికారంలోకి రావాలనే చూస్తుంది. ఈ దిశగానే రాజకీయం చేస్తుంది. అందుకని అసలు ప్రతిపక్షానికి అవకాశమే లేకుండా చేయాలని అడుగడుగునా అడ్డు తగిలే ప్రయత్నం చేయడం అధికార పక్షానికి తగదు. ఇలా చేస్తే భవిష్యత్తులో కథ అడ్డం తిరిగి తాము ప్రతిపక్షంలోకి వెళ్లినా ఇవే పరిస్థితులు ఎదురవుతాయి.
అసలు తమ పాలన మీద భరోసా ఉన్నపుడు ప్రతిపక్షం ఏ కార్యక్రమం చేసినా భయపడాల్సిన పని లేదు. అనవసరంగా ప్రతిపక్షానికి అడ్డు తగిలితే, ఇబ్బందులు సృష్టిస్తే అది అధికార పక్షం భయాన్ని, ఆత్మరక్షణ స్వభావాన్ని చాటి చెబుతుంది. అదే సమయంలో ప్రతిపక్షానికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఇప్పుడు ఇలాగే ఉన్నాయి.
అసలే జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండగా.. ఆ వ్యతిరేకతను ఇంకా పెంచేలా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. ఇటు తెలుగుదేశం, అటు జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా దానికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కారు.. శనివారం చేసిన ఓ పనితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార పార్టీ నేతలు వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ఏర్పాటు చేసిన రోజే పవన్ కళ్యాణ్ సాయంత్రం విశాఖలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు దగ్గర కోలాహలం నెలకొంది. ఆయన కోసం వేల మంది అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు. రోడ్ల వెంబడి కూడా పవన్ కోసం వేలాదిగా ఎదురు చూశారు.
ఐతే పవన్ ర్యాలీ జరిగే సమయానికి రోడ్లు, వీధుల వెంబడి లైట్లు ఆపించేయడం ద్వారా ఈ షోను ఫ్లాప్ చేయాలని చూశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవడానికి ఛాన్సే లేదు. ప్లాన్ ప్రకారమే జరిగిందన్నది స్పష్టం. ఐతే జనసైనికులు ఏమాత్రం వెరవకుండా తమ సెల్ ఫోన్ల లైట్లతో పవన్ రోడ్ షోకు వెలుగునిచ్చారు. ఈ చర్య కచ్చితంగా జగన్ సర్కారు భయాన్ని చాటిచెప్పేదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on October 15, 2022 9:12 pm
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…