Political News

విశాఖ గర్జన ఉన్నా పవన్ ర్యాలీకి భారీ రెస్పాన్స్

మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. విశాఖ‌కు చేరుకున్నారు. అయితే.. ఇదే రోజు వైసీపీ నాయ‌కులు.. గ‌ర్జ‌న యాత్ర చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో అస‌లు ప‌వ‌న్ కు ఎంత‌మంది నుంచి ఆద‌ర‌ణ ల‌బిస్తుందో చూడాల‌ని .. వైసీపీ నాయ‌కులు భావించారు. అయితే.. నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న అన్న‌గారి డైలాగును గుర్తు చేస్తూ.. అభిమానులు పోటెత్తారు. జోరు వ‌ర్షంలోనూ.. విశాఖ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. దీంతో విశాఖ జ‌న సంద్రంగా మారిపోయింది. అయితే.. ఇదే స‌మ‌యంలో విశాఖలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ శనివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్‌కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు మంత్రులు జోగి రమేశ్‌, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైసీపీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటనపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్‌ ద్వారా స్పందించారు. జనసైనికుల దాడిపై పవన్‌ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

This post was last modified on October 15, 2022 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విశ్వక్ అర్థం చేసుకున్న ట్రెండ్ నిజమేనా

నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…

18 minutes ago

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

1 hour ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

2 hours ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

2 hours ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

2 hours ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

3 hours ago