సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్-2 రియాల్టీ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి సంగతలు నుంచి రాజకీయాల వరకు అనేక విషయాలను పంచుకున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. కొన్ని చిలిపి విషయాలను కూడా.. చంద్రబాబు వెల్లడించారు. తొలుత బాలయ్య మాట్లాడుతూ.. ‘బావ.. మీరు ఎప్పుడైనా రొమాన్స్ చేశారా?’ అని అడిగితే..చంద్రబాబు చాలా సరదాగా ఆన్సర్ చేశారు. మీకన్నా ఎక్కువే చేశానంటూ.. సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో అమ్మాయిలు వస్తున్నారంటే.. బైకులకు సైలెన్సర్లు తీసేసి మరీ.. రయ్..రయ్యన.. దూసుకుపోయేవాళ్లమని చెప్పారు.
దీనికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. “అయితే.. అప్పట్లో మీరు చందు.. ఇప్పుడు చంద్రబాబు అన్నమాట!” అని సటైర్ పేల్చారు. అంతేకాదు.. యూని వర్సిటీ రోజుల్లో చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే.. నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అయితే.. అప్పట్లో తనను చూసిన వారు.. ఇలా.. ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు అమెరికాలో పర్యటిస్తే.. ఒక కార్యక్రమానికి ప్రవాస భారతీయులు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగించుకున్నాక.. ఒక లేడీ తన దగ్గరకు వచ్చి.. “మీరు అప్పటి చంద్రబాబేనా?” అని ఆసక్తిగా ప్రశ్నించినట్టు చంద్రబాబు తెలిపారు.
ఔను.. అప్పటి చంద్రబాబునే.. కానీ, ఇప్పుడు వేరు.. అని సమాధానం చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. ఇంట్లో కూడా అందరం సరదాగా ఉంటామని బాబు తెలిపారు. ఇంట్లో పెత్తనం అంతా తన సతీమణి భువనేశ్వరిదేనన్న చంద్రబాబు.. ఆమెను ‘భువ్వు’ అని పిలుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నేరుగా కార్యక్రమం నుంచే ఫోన్లో ఆమెతో సంభాంచారు. ఈ సందర్భంగా.. తన సోదరికి ఐలవ్యూ చెప్పాలని బాలయ్య ఒత్తిడి చేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం ఐలైక్ యూ అని చెప్పి.. ఐలవ్యూ కన్నా.. ఇది మరింత బలమైన బంధమని చెప్పుకొచ్చారు. ఇలా.. బాలయ్యతో కేవలం రాజకీయాలే కాకుండా.. కుటుంబ విషయాలను సైతం చంద్రబాబు పంచుకోవడం గమనార్హం.
This post was last modified on October 15, 2022 2:04 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…