సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్-2 రియాల్టీ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి సంగతలు నుంచి రాజకీయాల వరకు అనేక విషయాలను పంచుకున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. కొన్ని చిలిపి విషయాలను కూడా.. చంద్రబాబు వెల్లడించారు. తొలుత బాలయ్య మాట్లాడుతూ.. ‘బావ.. మీరు ఎప్పుడైనా రొమాన్స్ చేశారా?’ అని అడిగితే..చంద్రబాబు చాలా సరదాగా ఆన్సర్ చేశారు. మీకన్నా ఎక్కువే చేశానంటూ.. సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో అమ్మాయిలు వస్తున్నారంటే.. బైకులకు సైలెన్సర్లు తీసేసి మరీ.. రయ్..రయ్యన.. దూసుకుపోయేవాళ్లమని చెప్పారు.
దీనికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. “అయితే.. అప్పట్లో మీరు చందు.. ఇప్పుడు చంద్రబాబు అన్నమాట!” అని సటైర్ పేల్చారు. అంతేకాదు.. యూని వర్సిటీ రోజుల్లో చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే.. నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అయితే.. అప్పట్లో తనను చూసిన వారు.. ఇలా.. ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు అమెరికాలో పర్యటిస్తే.. ఒక కార్యక్రమానికి ప్రవాస భారతీయులు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగించుకున్నాక.. ఒక లేడీ తన దగ్గరకు వచ్చి.. “మీరు అప్పటి చంద్రబాబేనా?” అని ఆసక్తిగా ప్రశ్నించినట్టు చంద్రబాబు తెలిపారు.
ఔను.. అప్పటి చంద్రబాబునే.. కానీ, ఇప్పుడు వేరు.. అని సమాధానం చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. ఇంట్లో కూడా అందరం సరదాగా ఉంటామని బాబు తెలిపారు. ఇంట్లో పెత్తనం అంతా తన సతీమణి భువనేశ్వరిదేనన్న చంద్రబాబు.. ఆమెను ‘భువ్వు’ అని పిలుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నేరుగా కార్యక్రమం నుంచే ఫోన్లో ఆమెతో సంభాంచారు. ఈ సందర్భంగా.. తన సోదరికి ఐలవ్యూ చెప్పాలని బాలయ్య ఒత్తిడి చేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం ఐలైక్ యూ అని చెప్పి.. ఐలవ్యూ కన్నా.. ఇది మరింత బలమైన బంధమని చెప్పుకొచ్చారు. ఇలా.. బాలయ్యతో కేవలం రాజకీయాలే కాకుండా.. కుటుంబ విషయాలను సైతం చంద్రబాబు పంచుకోవడం గమనార్హం.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…