భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏపీలోకి ఎంట్రీ అదిరిపోయింది. కర్నాటకలో నుండి ఏపీలోని అనంతపురం జిల్లాలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించింది. జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో డీ హిరేహాల్ మండలంలోని జాజరకల్లు గ్రామంలోకి రాహుల్ పాదయాత్రతో ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ ను స్వాగతించేందుకు నేతలు, శ్రేణులు భారీఎత్తున పోటీపడ్డారు. పార్టీ నేతలు, శ్రేణులు కాబట్టి పోటీపడ్డారంటే అర్ధముంది. కానీ మామూలు జనాలు కూడా రాహుల్ ను చూడటం కోసం ఎగబడటమే ఆశ్చర్యంగా ఉంది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు జాజర కల్లు గ్రామంలోకి రాహుల్ వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని జనాలు గ్రామం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. రాహుల్ కు స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు వేలాది పోస్టర్లు, బ్యానర్లు కట్టారు. రాహుల్ వచ్చిన సమయంలో ఏదో పెద్ద ఉత్సవం జరుగుతున్న వాతావరణం కనిపించింది. దాదాపు మూడున్నర సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన మద్దతుదారులతో రాహుల్ ను రిసీవ్ చేసుకోవటం విశేషమనే చెప్పాలి.
అగ్రనేతను రిసీవ్ చేసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ తదితరులు పోటీపడ్డారు. ఏదేమైనా రాహుల్ పాదయాత్ర చాలా సంవత్సరాల తర్వాత పార్టీ నేతలు, శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. హీరేహల్ మండల కేంద్రంలో భారీ ఎత్తున జనాలు చేరారు. అయితే వీరంతా బాగా నీరసపడిపోయారు. ఎందుకంటే రాహుల్ రోడ్డుషో లేదా సభలో మాట్లాడుతారని జనాలంతా అనుకున్నారు.
అయితే జనాలు ఆశించినట్లుగా రాహుల్ ఏమీ మాట్లాడలేదు. పాదయాత్రలో అందరికీ నమస్కారం చేస్తు, చేతులు ఊపుతు అభివాదాలు చేసుకుంటు వెళిపోయారు. నిజానికి రాహుల్ మాట్లాడుతారని నేతలు కూడా ఎవరు చెప్పలేదు. మండల కేంద్రంలో రాహుల్ మాట్లాడటమన్నది డైలీ ప్రోగ్రామ్ లో లేదు కాబట్టి ఆయన మాట్లాడలేదంతే. ఏదేమైనా పార్టీ నేతల్లో మాత్రం రాహుల్ పాదయాత్ర మంచి ఊపునిచ్చింది వాస్తవం.
This post was last modified on October 15, 2022 10:19 am
నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక, ఆయన చేసిన చిత్రాల్లో అభిమానులను అత్యంత అలరించింది ఓజీనే. సినిమా…
ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…
ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…
ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…
శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…