మాజీ మంత్రి కొడాలి నాని పై గుడివాడ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా” అని రావి సవాల్ చేశారు. కొడాలి నాని కాళ్ళు పట్టుకొని అడుక్కోవడంతోనే చంద్రబాబు ‘బి’ ఫారం ఇచ్చారని గుర్తుచేశారు. గుడివాడలో హరికృష్ణ ను ఓడించింది కొడాలి నానినే అని అన్నారు. చరిత్రను ఎవ్వరూ మోసం చెయ్యలేరని తెలిపారు.
కొడాలి జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ బిడ్డల గురించి ఎంత దారుణంగా మాట్లాతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారని… కొడాలి నాని గుడ్డలు ఊడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు. నాని గడ్డంలోని తెల్ల వెంట్రుక పీకలేరని రోజా అంటున్నారని… వెంట్రుకను ఆమె ఎప్పుడు చూసిందో అంటూ యెద్దేవా చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు సిగ్గు లజ్జ లేదని… జగన్ ది దోపిడీ దొంగల కుటుంబమని వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పి వైసీపీ జెండాలు పట్టుకోవాలని అన్నారు. వ్యవస్థల్లో ప్రధానమైన మీడియాపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కొడాలి నానిని చెప్పుతో కొట్టాలన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని కొడాలి నాని సంపాదించిన 5వేల కోట్ల అవినీతి సొమ్ము వైజాగ్, శామీర్పేట, బెంగుళూరు లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. కొడాలి బినామీ దారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే గడ్డం గ్యాంగ్ అరాచకాలను ఉక్కు పాదంతో అనిచి వేస్తానని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
This post was last modified on October 15, 2022 7:15 am
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…