ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది.
అందుకే తరచుగా.. వాళ్లు.. ‘దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలంటూ’ కామెంట్లు చేస్తున్నారు. పవన్ సహా.. టీడీపీని కూడా రెచ్చగొడుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తమకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచన కావొచ్చు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించడం.. పొరుగు రాష్ట్రాల్లోనూ దీనిని విస్తరించాలనే ప్లాన్ వేసుకోవడం.. వంటివి.. వైసీపీ నేతలను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి.
“బీఆర్ఎస్ ఇక్కడకు కూడా రావాలి. ఏ పార్టీకైనా.. స్వేచ్ఛ ఉంటుంది. పైగా.. తెలుగు వారు ఒక జాతీయ పార్టీ పెట్టి.. ఢిల్లీలో జెండా ఎగరేస్తామంటే..మనం ప్రొత్సహించకపోతే.. ఎలా?!” అని వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజానికి ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎలా అడుగు పెడుతుందనే టాక్ మేధావుల నుంచి వినిపిస్తోంది. ఏపీకి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణమైన.. టీఆర్ఎస్.. అధినేత కేసీఆర్.. ఎలా అడుగు పెడతారని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం కేసీఆర్ రావాలి.. ఏపీకి కావాలి.. అని దీర్ఘాలు తీస్తున్నారు. దీని అంతరార్థం.. ఏంటా అని కొంచెం లోతుగా చూస్తే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ఇప్పుడున్న ఆయుధం.. బీఆర్ఎస్ ఒక్కటేననివారు నమ్ముతుండడమే. బీఆర్ ఎస్ కనుక.. ఏపీలో పోటీకి దిగితే.. ఇక, వ్యతిరక ఓటు బ్యాంకు చీలి.. తమకు మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి .. దీనిని ఎలా చూడాలో.. చూస్తారో.. ప్రజలే తేలుస్తారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 14, 2022 10:27 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…