ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది.
అందుకే తరచుగా.. వాళ్లు.. ‘దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలంటూ’ కామెంట్లు చేస్తున్నారు. పవన్ సహా.. టీడీపీని కూడా రెచ్చగొడుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తమకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచన కావొచ్చు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించడం.. పొరుగు రాష్ట్రాల్లోనూ దీనిని విస్తరించాలనే ప్లాన్ వేసుకోవడం.. వంటివి.. వైసీపీ నేతలను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి.
“బీఆర్ఎస్ ఇక్కడకు కూడా రావాలి. ఏ పార్టీకైనా.. స్వేచ్ఛ ఉంటుంది. పైగా.. తెలుగు వారు ఒక జాతీయ పార్టీ పెట్టి.. ఢిల్లీలో జెండా ఎగరేస్తామంటే..మనం ప్రొత్సహించకపోతే.. ఎలా?!” అని వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజానికి ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎలా అడుగు పెడుతుందనే టాక్ మేధావుల నుంచి వినిపిస్తోంది. ఏపీకి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణమైన.. టీఆర్ఎస్.. అధినేత కేసీఆర్.. ఎలా అడుగు పెడతారని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం కేసీఆర్ రావాలి.. ఏపీకి కావాలి.. అని దీర్ఘాలు తీస్తున్నారు. దీని అంతరార్థం.. ఏంటా అని కొంచెం లోతుగా చూస్తే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ఇప్పుడున్న ఆయుధం.. బీఆర్ఎస్ ఒక్కటేననివారు నమ్ముతుండడమే. బీఆర్ ఎస్ కనుక.. ఏపీలో పోటీకి దిగితే.. ఇక, వ్యతిరక ఓటు బ్యాంకు చీలి.. తమకు మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి .. దీనిని ఎలా చూడాలో.. చూస్తారో.. ప్రజలే తేలుస్తారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 14, 2022 10:27 am
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…