ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది.
అందుకే తరచుగా.. వాళ్లు.. ‘దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలంటూ’ కామెంట్లు చేస్తున్నారు. పవన్ సహా.. టీడీపీని కూడా రెచ్చగొడుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తమకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచన కావొచ్చు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా ఆవిర్భవించడం.. పొరుగు రాష్ట్రాల్లోనూ దీనిని విస్తరించాలనే ప్లాన్ వేసుకోవడం.. వంటివి.. వైసీపీ నేతలను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి.
“బీఆర్ఎస్ ఇక్కడకు కూడా రావాలి. ఏ పార్టీకైనా.. స్వేచ్ఛ ఉంటుంది. పైగా.. తెలుగు వారు ఒక జాతీయ పార్టీ పెట్టి.. ఢిల్లీలో జెండా ఎగరేస్తామంటే..మనం ప్రొత్సహించకపోతే.. ఎలా?!” అని వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజానికి ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎలా అడుగు పెడుతుందనే టాక్ మేధావుల నుంచి వినిపిస్తోంది. ఏపీకి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణమైన.. టీఆర్ఎస్.. అధినేత కేసీఆర్.. ఎలా అడుగు పెడతారని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం కేసీఆర్ రావాలి.. ఏపీకి కావాలి.. అని దీర్ఘాలు తీస్తున్నారు. దీని అంతరార్థం.. ఏంటా అని కొంచెం లోతుగా చూస్తే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ఇప్పుడున్న ఆయుధం.. బీఆర్ఎస్ ఒక్కటేననివారు నమ్ముతుండడమే. బీఆర్ ఎస్ కనుక.. ఏపీలో పోటీకి దిగితే.. ఇక, వ్యతిరక ఓటు బ్యాంకు చీలి.. తమకు మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి .. దీనిని ఎలా చూడాలో.. చూస్తారో.. ప్రజలే తేలుస్తారని అంటున్నారు పరిశీలకులు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…