Political News

విజయసాయి పనైపోయినట్లేనా?

కొంత కాలం ముందు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా ఉండేవారు విజయసాయిరెడ్డి. కానీ నెమ్మదిగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్థానాన్ని ఆక్రమించేశారు. ఆయన్ని వెనక్కి నెట్టేశారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే విజయసాయికి మూడో స్థానం కూడా దక్కేట్లు కనిపించడం లేదు.

ఆయన పార్టీ అధినేత, ఇతర నేతల విశ్వాసం కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే విజయసాయిని వైకాపా డిస్ ఓన్ చేసుకుంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగా పార్టీ ముఖ్య నేతలు ఎవరి మీదైనా ప్రతిపక్షం, వ్యతిరేక మీడియా నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తే.. వైకాపా నుంచి గట్టిగా ఎదురు దాడి ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీ పత్రిక అయిన సాక్షి మామూలుగా ఎటాక్ చేయదు. గతంలో విజయసాయికి ఆ పత్రిక ఇచ్చిన ప్రాధాన్యమే వేరు.

కానీ తాజాగా విశాఖపట్నంలో విజయసాయి భూ దందా గురించి ఈనాడు పత్రిక ఒక సంచలన కథనం ప్రచురించగా.. దాని గురించి అసలు వైకాపా వైపు నుంచి సౌండే లేదు. ఆ పార్టీ తరఫున ఒక ఖండన లేదు. వేరే నేతల నుంచి స్పందన లేదు. ముఖ్యంగా సాక్షి పత్రిక ఇంతకుముందులా విజయసాయిని వెనకేసుకొస్తూ ఈనాడు మీద ఎదురు దాడి చేయడం అస్సలు కనిపించలేదు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా సాక్షి విస్మరించింది. వైకాపా నేతలు ఇంకెవరు కూడా దీన్ని ఖండించలేదు.

విజయసాయి కూడా రెండు రోజులు మౌనంగా ఉండి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన ఫ్రస్టేషన్ అంతా బయటపెట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ పూర్తిగా తేలిపోయింది. తన కూతురు, అల్లుడు ఆస్తులు కొంటే తనకేం సంబంధం అనేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇలాంటి ఆరోపణణలు, ఆధారాలు లేకుండా ఎన్ని చేశారో లెక్కలేదు. ఈ విషయానికి కూడా కులం రంగు పులుముతూ ఆయన చేసిన ఎదురు దాడి తుస్సుమనిపించింది.

ఈ వివాదం విషయంలో ఆయన సోలో బ్యాటింగ్ చేస్తున్నారే తప్ప వైకాపా నుంచి సపోర్ట్ లేదు. ఇదిలా ఉండగా.. మధ్యలో వైజాగ్ ఎంపీకి సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వివాదం గురించి ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విశాఖ కేంద్రంగా వైకాపాలో నెలకొన్న కుమ్ములాటలకు కూడా నిదర్శనంగా నిలవడం గమనార్హం.

This post was last modified on October 12, 2022 4:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

3 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

3 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

4 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

6 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

6 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

7 hours ago