Political News

విజయసాయి పనైపోయినట్లేనా?

కొంత కాలం ముందు వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2గా ఉండేవారు విజయసాయిరెడ్డి. కానీ నెమ్మదిగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన స్థానాన్ని ఆక్రమించేశారు. ఆయన్ని వెనక్కి నెట్టేశారు. ఇటీవల పరిస్థితులు చూస్తుంటే విజయసాయికి మూడో స్థానం కూడా దక్కేట్లు కనిపించడం లేదు.

ఆయన పార్టీ అధినేత, ఇతర నేతల విశ్వాసం కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తే విజయసాయిని వైకాపా డిస్ ఓన్ చేసుకుంటోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగా పార్టీ ముఖ్య నేతలు ఎవరి మీదైనా ప్రతిపక్షం, వ్యతిరేక మీడియా నుంచి విమర్శలు, ఆరోపణలు వస్తే.. వైకాపా నుంచి గట్టిగా ఎదురు దాడి ఉంటుంది. ముఖ్యంగా ఆ పార్టీ పత్రిక అయిన సాక్షి మామూలుగా ఎటాక్ చేయదు. గతంలో విజయసాయికి ఆ పత్రిక ఇచ్చిన ప్రాధాన్యమే వేరు.

కానీ తాజాగా విశాఖపట్నంలో విజయసాయి భూ దందా గురించి ఈనాడు పత్రిక ఒక సంచలన కథనం ప్రచురించగా.. దాని గురించి అసలు వైకాపా వైపు నుంచి సౌండే లేదు. ఆ పార్టీ తరఫున ఒక ఖండన లేదు. వేరే నేతల నుంచి స్పందన లేదు. ముఖ్యంగా సాక్షి పత్రిక ఇంతకుముందులా విజయసాయిని వెనకేసుకొస్తూ ఈనాడు మీద ఎదురు దాడి చేయడం అస్సలు కనిపించలేదు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా సాక్షి విస్మరించింది. వైకాపా నేతలు ఇంకెవరు కూడా దీన్ని ఖండించలేదు.

విజయసాయి కూడా రెండు రోజులు మౌనంగా ఉండి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తన ఫ్రస్టేషన్ అంతా బయటపెట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ పూర్తిగా తేలిపోయింది. తన కూతురు, అల్లుడు ఆస్తులు కొంటే తనకేం సంబంధం అనేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల మీద ఇలాంటి ఆరోపణణలు, ఆధారాలు లేకుండా ఎన్ని చేశారో లెక్కలేదు. ఈ విషయానికి కూడా కులం రంగు పులుముతూ ఆయన చేసిన ఎదురు దాడి తుస్సుమనిపించింది.

ఈ వివాదం విషయంలో ఆయన సోలో బ్యాటింగ్ చేస్తున్నారే తప్ప వైకాపా నుంచి సపోర్ట్ లేదు. ఇదిలా ఉండగా.. మధ్యలో వైజాగ్ ఎంపీకి సంబంధించి ఓ రియల్ ఎస్టేట్ వివాదం గురించి ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విశాఖ కేంద్రంగా వైకాపాలో నెలకొన్న కుమ్ములాటలకు కూడా నిదర్శనంగా నిలవడం గమనార్హం.

This post was last modified on October 12, 2022 4:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పుట్టా మహేష్ వివాదంపై స్పందించిన బాబు

ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…

2 hours ago

బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?

ఇంట్లో బైక్‌ను స్టార్ట్‌లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…

2 hours ago

కొత్త రిస్కుకు రెడీ అవుతున్న మెగా హీరో

క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…

2 hours ago

ఎవరూ మాట్లాడ్డం లేదు విశ్వక్

కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…

4 hours ago

మౌన వ్రతానికి శుభం కార్డు ఎప్పుడో

మన శంకరవరప్రసాద్ గారు రిలీజై రెండు నెలలు దాటేసింది. ఓటిటిలో వచ్చింది. శాటిలైట్ లోనూ అదరగొట్టింది. కానీ ఇప్పటిదాకా చిరంజీవి…

5 hours ago

పొలిటిక‌ల్ చిత్రం: జ‌గ‌న్‌కు నాగ‌బాబు సూచ‌న‌లు.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు జ‌న‌సేన పార్టీముఖ్య నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. కీల‌క సూచ‌న‌లు చేశారు. అయితే.. జ‌గ‌న్ ఎవ‌రి మాటా…

6 hours ago