ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసే విషయం.. వెన్నుపోటు. పిల్లనిచ్చి, పార్టీలో కీలక స్థానం ఇచ్చిన మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని చంద్రబాబు మీద ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ రోజున్న పరిస్థితుల్లో తప్పక అలా చేయాల్సి వచ్చిందని చంద్రబాబు కొన్ని సందర్భాల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా హైలైట్ కాలేదు.
నిజానికి ఆ పరిణామం జరిగిన కొన్నేళ్లకే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడాన్ని బట్టి ఆ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని, ఆమోదించారని భావించవచ్చు. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా వైసీపీ అదే విషయాన్ని లేవనెత్తి చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా అభివర్ణిస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తుంటుంది.
ఐతే ఇలాంటి విషయాల్లో మౌనం వహించడం వల్ల లాభం లేదని చంద్రబాబుకు ఎట్టకేలకు అర్థమైనట్లుంది. అందుకే ఆ ఎపిసోడ్ గురించి ప్రజలకు వివరించి చెప్పాలని ఆయన డిసైడైనట్లున్నారు. మామూలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ఏదైనా రాజకీయ సభలోనో దీని గురించి వివరిస్తే జనాలకు సరిగా రీచ్ కాకపోవచ్చు. అందుకే బాలయ్య సూపర్ హిట్ టాక్ షో అన్స్టాపబుల్ను వేదికగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాన్ని వివరిస్తే దాని రీచ్యే వేరుగా ఉంటుందని తెలివిగానే పసిగట్టారు. షోకు వచ్చామా నాలుగు తమాషా కబుర్లు చెప్పామా అని కాకుండా ఇలాంటి వివాదాస్పద అంశాన్ని ఎంచుకుని సవివరంగా అసలేం జరిగిందో, ఏ పరిస్థితుల్లో తాను అలా చేయాల్సి వచ్చిందో వివరించాలని అనుకోవడం చంద్రబాబు వేసిన మంచి ఎత్తుగడగా భావించాలి.
ఇది వైసీపీకి బాబు-బాలయ్య కలిసి ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్గా భావించవచ్చు. అలాగే నారా లోకేష్ అమ్మాయిలతో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫొటోల విషయంలోనూ వైసీపీ ఎప్పుడూ విమర్శలు చేస్తుంటుంది. దానికి కూడా ఈ కార్యక్రమంలో లోకేష్ వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ రెండు విషయాల్లో జనాలకు స్పష్టత ఇవ్వాలని తండ్రీ కొడుకులు భావించడం మంచి విషయమే. ఈ ఎపిసోడ్ కోసం తెలుగుదేశం మద్దతుదారులే కాదు, సామాన్య జనాలు.. ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్లు కూడా ఎదురు చూసేలా అదిరిపోయే ప్రోమోను కట్ చేశారు.
This post was last modified on October 11, 2022 10:54 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…