కారు పార్టీ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు తొందరలోనే పార్టీ మారబోతున్నారా ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాల కారణంగా అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉండేవారు. మంత్రి పదవి అందుకున్న తర్వాత జిల్లా మొత్తం మీద చక్రంతిప్పారు. అలాంటి జూపల్లి తెలంగాణా ఉద్యమంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.
మొదటి నుంచి కేసీయార్ తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. అయితే అనేక కారణాల వల్ల కేసీయార్ తో బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో మంత్రి పదవి పోవటంతోనే కాకుండా చివరకు 2018 ఎన్నికల్లో అసలు గెలుపే కష్టమైపోయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. దాంతో జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయి బీరంకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.
కొంతకాలం తర్వాత బీరం కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. దాంతో జూపల్లికి అసలుకే మోసం జరిగింది. మాజీమంత్రిని నియోజకవర్గంలో అధికారులు పట్టించుకోవటం మానేశారు. చివరకు వీళ్ళిద్దరి మధ్య గొడవల కారణంగా జూపల్లి మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారట. ఇదే విషయాన్ని కేసీయార్ దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదని జూపల్లి మండిపోతున్నారు.
దీంతోనే పార్టీలో తన పరిస్ధితి ఏమిటో జూపల్లికి అర్ధమైపోయింది. అందుకనే పార్టీమారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సీనియర్ నేతకాబట్టి బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో జూపల్లికి పడదు. మరి పాత వైరాలను సయోధ్య చేసుకుని బీజేపీలో చేరుతారా ? లేకుంట కాంగ్రెస్ లోకి మారిపోతారా అన్నది చూడాల్సుంది.
This post was last modified on October 11, 2022 2:46 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…