కారు పార్టీ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు తొందరలోనే పార్టీ మారబోతున్నారా ? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాల కారణంగా అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కొల్హాపూర్ నియోజకవర్గంలో ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉండేవారు. మంత్రి పదవి అందుకున్న తర్వాత జిల్లా మొత్తం మీద చక్రంతిప్పారు. అలాంటి జూపల్లి తెలంగాణా ఉద్యమంలో మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.
మొదటి నుంచి కేసీయార్ తో మంచి సంబంధాలు ఉన్న కారణంగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవి కూడా దక్కింది. అయితే అనేక కారణాల వల్ల కేసీయార్ తో బాగా గ్యాప్ పెరిగిపోయింది. దాంతో మంత్రి పదవి పోవటంతోనే కాకుండా చివరకు 2018 ఎన్నికల్లో అసలు గెలుపే కష్టమైపోయింది. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. దాంతో జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయి బీరంకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది.
కొంతకాలం తర్వాత బీరం కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. దాంతో జూపల్లికి అసలుకే మోసం జరిగింది. మాజీమంత్రిని నియోజకవర్గంలో అధికారులు పట్టించుకోవటం మానేశారు. చివరకు వీళ్ళిద్దరి మధ్య గొడవల కారణంగా జూపల్లి మద్దతుదారులపై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారట. ఇదే విషయాన్ని కేసీయార్ దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం కనబడలేదని జూపల్లి మండిపోతున్నారు.
దీంతోనే పార్టీలో తన పరిస్ధితి ఏమిటో జూపల్లికి అర్ధమైపోయింది. అందుకనే పార్టీమారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సీనియర్ నేతకాబట్టి బీజేపీ, కాంగ్రెస్ నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళతో జూపల్లికి పడదు. మరి పాత వైరాలను సయోధ్య చేసుకుని బీజేపీలో చేరుతారా ? లేకుంట కాంగ్రెస్ లోకి మారిపోతారా అన్నది చూడాల్సుంది.
This post was last modified on October 11, 2022 2:46 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…