ఊపందుకుంటున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం మొదలైంది. కారణం ఏమిటంటే నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండలం కేంద్రంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలవటమే. ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలీదు. రాజగోపాలరెడ్డి ప్రతిఓటుకు వేలాది రూపాయలు ఇవ్వటానికి రెడీ అయ్యారని, కావాల్సిన వారు పలానా నెంబర్ కు ఫోన్ చేయండంటు ఫేన్ పే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారు.
ఫోన్ పే రూపంలో కాంట్రాక్ట్ పే అని పోస్టర్లలో ఉంది. రు. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకున్నారు కాబట్టి ఓటుకు ఎంత డబ్బైనా ఇవ్వటానికి రాజగోపాలరెడ్డి రెడీ అన్నట్లుగా పోస్టర్లలో ఉంది. నియోజకవర్గంలోని చండూరు పట్టణంలో వేలాది పోస్టర్లు అతికించారు. మొదటినుండి కూడా రాజగోపాల్ కేవలం కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఆరోపించారు.
అక్కడినుండి చాలామంది మాజీ ఎంఎల్ఏపై ఇదే విదమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకదశలో తనపై ఆరోపణలను రాజగోపాల్ తిప్పికొట్టారు. అయితే ఆయనకు ఛత్తీస్ ఘర్లో బొగ్గు కాంట్రాక్టు రావటం, కొద్దిరోజులకే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరటం లాంటివి జరగటంతో జనాల్లో కూడా ఇదే విషయం బాగా రిజస్టర్ అయిపోయింది. దీనికితోడు మూడురోజుల క్రితం రాజగోపాల్ మాట్లాడుతు తనకు బొగ్గుగనులు దక్కినమాట వాస్తవమే అని అంగీకరించారు. పైగా తన గెలుపుకోసమే తన అన్న, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తారని మీడియా సమావేశంలోనే ప్రకటించారు.
దాంతో బ్రదర్స్ ఇద్దరికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా చర్యలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ నేపధ్యంలోనే బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవటటం సంచలనంగా మారింది. వ్యక్తిగతంగా అభ్యర్ది ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు కాబట్టి ఓటుకునోటుకు పంచటంలో ఎలాంటి లోటుండదని అందరికీ తెలుసు.
This post was last modified on October 11, 2022 2:40 pm
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…