జనసేన పార్టీని బలోపేతం చేయాలని.. పార్టీ అధినేత, పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన రోజు వారీ సమీక్షలు చేసేందుకు కూడా నిర్ణయించారు. జిల్లాల వారీగా నేతలను నిర్ణయించి.. వారికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై పక్కా ప్లాన్ ను అమలు చేయనున్నారు. అయితే.. ఈ క్రమంలోనే పార్టీలోకి కొత్తగా వచ్చేవారిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
నిర్ణయం అయితే.. తీసుకున్నారు కానీ, ఎవరు వస్తారు? ఎవరిని చేర్చుకోవాలి? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. 2014-2019 మధ్య పవన్ అంటే..ఉన్న ఇమేజ్ వేరు. ఆయన పార్టీపైనా..ఎంతో అభిమానం.. ఎన్నో వ్యూహాలు ఉన్నాయని అనుకున్నారు. ఆయన ప్రసంగాలతో ఉత్తేజితులు అయినవారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది .. మేధావులు అంటున్న మాట. అందుకే.. గడిచిన మూడేళ్ల కాలంలో అనేక మంది మేధావులు.. మాజీ ఉద్యోగులు కూడా.. పార్టీకి దూరమయ్యారు.
ఇక, ఇప్పుడు కూడా ఒక వ్యూహం లేకుండానే జనసేన రాజకీయ అడుగులు వేస్తోందన్నది మేధావుల మాట. ఏదో ఒక నిర్ణయం తీసుకుని.. ముందుకు సాగితే.. జనసేనతో కలిసి అడుగులు వేసేందుకు కొందరు సిద్ధంగానే ఉన్నారు.కానీ, వచ్చే ఎన్నికలపై ఎలాంటి వ్యూహం లేదనేది వారి మాట. వైసీపీ వ్యతిరేకత ఓటు బ్యాంకు చీలిపోకుండా.. చూస్తానని మాత్రమే పవన్ చెప్పారు తప్ప.. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తామనేది మాత్రం ఆయన చెప్పలేదు.
పోనీ.. బీజేపీతో పొత్తును కొనసాగిస్తారా? అంటే.. అది కూడా కనిపించడంలేదు. టీడీపీతో మళ్లీ చెలిమి చేస్తారా? అంటే.. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ పరిణామాలతో జనసేన వైపు చూసే మేధావులు.. ఉన్నత వర్గాలు నానాటికీ తగ్గిపోతున్నాయని అంటున్నారు. నిజానికి ఇప్పుడు.. ఏపీలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం పవన్ చేయడం లేదన్నది.. వారి వాదన. అందుకే.. ఆపార్టీ చేర్చుకోవాలని అనుకుంటున్నా.. వచ్చి చేరేందుకు.. జై కొట్టేందుకు మేధావులు రెడీ గా లేరనేది ప్రధాన సమస్యగా మారింది.
This post was last modified on October 11, 2022 11:30 am
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…