జనసేన పార్టీని బలోపేతం చేయాలని.. పార్టీ అధినేత, పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయన రోజు వారీ సమీక్షలు చేసేందుకు కూడా నిర్ణయించారు. జిల్లాల వారీగా నేతలను నిర్ణయించి.. వారికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై పక్కా ప్లాన్ ను అమలు చేయనున్నారు. అయితే.. ఈ క్రమంలోనే పార్టీలోకి కొత్తగా వచ్చేవారిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
నిర్ణయం అయితే.. తీసుకున్నారు కానీ, ఎవరు వస్తారు? ఎవరిని చేర్చుకోవాలి? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. 2014-2019 మధ్య పవన్ అంటే..ఉన్న ఇమేజ్ వేరు. ఆయన పార్టీపైనా..ఎంతో అభిమానం.. ఎన్నో వ్యూహాలు ఉన్నాయని అనుకున్నారు. ఆయన ప్రసంగాలతో ఉత్తేజితులు అయినవారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది .. మేధావులు అంటున్న మాట. అందుకే.. గడిచిన మూడేళ్ల కాలంలో అనేక మంది మేధావులు.. మాజీ ఉద్యోగులు కూడా.. పార్టీకి దూరమయ్యారు.
ఇక, ఇప్పుడు కూడా ఒక వ్యూహం లేకుండానే జనసేన రాజకీయ అడుగులు వేస్తోందన్నది మేధావుల మాట. ఏదో ఒక నిర్ణయం తీసుకుని.. ముందుకు సాగితే.. జనసేనతో కలిసి అడుగులు వేసేందుకు కొందరు సిద్ధంగానే ఉన్నారు.కానీ, వచ్చే ఎన్నికలపై ఎలాంటి వ్యూహం లేదనేది వారి మాట. వైసీపీ వ్యతిరేకత ఓటు బ్యాంకు చీలిపోకుండా.. చూస్తానని మాత్రమే పవన్ చెప్పారు తప్ప.. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరిస్తామనేది మాత్రం ఆయన చెప్పలేదు.
పోనీ.. బీజేపీతో పొత్తును కొనసాగిస్తారా? అంటే.. అది కూడా కనిపించడంలేదు. టీడీపీతో మళ్లీ చెలిమి చేస్తారా? అంటే.. దీనిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ పరిణామాలతో జనసేన వైపు చూసే మేధావులు.. ఉన్నత వర్గాలు నానాటికీ తగ్గిపోతున్నాయని అంటున్నారు. నిజానికి ఇప్పుడు.. ఏపీలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం పవన్ చేయడం లేదన్నది.. వారి వాదన. అందుకే.. ఆపార్టీ చేర్చుకోవాలని అనుకుంటున్నా.. వచ్చి చేరేందుకు.. జై కొట్టేందుకు మేధావులు రెడీ గా లేరనేది ప్రధాన సమస్యగా మారింది.
This post was last modified on October 11, 2022 11:30 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…