వ్యక్తులపై కక్షతో ముఖ్యమంత్రి జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు.. వ్యక్తులపై కక్షతో వ్యవస్థలను నాశనం చేయకూడదని, రాష్ట్రంలో జగన్ మొదటి నుంచి ఇదే చేస్తున్నారని మండిపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతికి ప్రతిష్ఠాత్మకమైన విట్, ఎస్ఆర్ఎం వంటి విద్యా సంస్థలు వచ్చాయన్నారు.
మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని అలాంటి సంస్థలు రాజధానిలో ఉండకూడదని కనీసం రోడ్ల సదుపాయం కల్పించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. మరమ్మతులు చేయకపోవడం ఎంతటి దారుణమైన మానసిక స్థితి అని ఆక్షేపించారు. విట్, ఎస్ఆర్ఎం సంస్థలకు వెళ్లడానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలని కోరారు.
తమ రాజకీయ లక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు…కానీ అవి ఇలా సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని చంద్రబాబు హితవుపలికారు. కాగా, అమరావతిలో ఏర్పడిన ప్రతిష్టాత్మక సంస్థలు ఇప్పటికేనిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యక్రమాలు కూడా ప్రారంభించాయి. అయితే.. ఆయా సంస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, తాగునీరు..వంటివి ప్రభుత్వం కల్పించాలి. అవి కల్పిస్తామని హామీ ఇచ్చిన తర్వాత.. అవి ఇక్కడ ఏర్పాటయ్యాయి.
అయితే.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వాటిని ప్రారంభించారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆయా పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. తర్వాత.. వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని అసలు పట్టించుకోవడం మానేసింది. దీంతో ఇప్పుడు ఆయా సంస్థల నిర్వహణ కూడా కష్ట సాధ్యంగా మారడంతో.. సంస్థలను మూసేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on October 10, 2022 3:21 pm
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…