Political News

ఏపీలో సెంటిమెంట్ పిండే ఐడియా వేసిన బీజేపీ

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ను విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏపీలోకి అడుగుపెట్టేముందే కేసీయార్ క్షమాపణలు చెప్పాలట. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీయార్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వద్దామని అనుకుంటున్నారంటు నిలదీశారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులదండ వేసి కాళ్ళు, చేతులు తొలగించిన వ్యక్తి కేసీయార్ అంటు మండిపడ్డారు.

సరే రాష్ట్ర విభజన సందర్భంగా కానీ ఆ తర్వాత కానీ ఏపీ జనాలను ఉద్దేశించి కేసీయార్ చాలా అవమానకరంగా మాట్లాడిందైతే వాస్తవమే. బీఆర్ఎస్ ఏర్పాటుతో ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్న కేసీయార్ కు ఓట్లేయాలా వద్దా అనేది జనాలు చూసుకుంటారు. అయితే.. కేసీఆర్ ఆధారంగా ఏపీలో తెలుగు తల్లి సెంటిమెంట్ ను పండించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఏపీకి కేసీయార్ చేసిన ద్రోహం సంగతి సరే మరి బీజేపీ చేసిన ద్రోహం మాటేమిటి ? 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఏపీకి ఎంత అన్యాయం చేస్తోందో అందరికీ తెలుసు. విభజనచట్టం అమలును నరేంద్రమోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. ప్రత్యేకహోదాపై దెబ్బకొట్టింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ అంశాన్ని గాలికొదిలేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిదులను ఆపేసింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా బాగా ఇబ్బంది పెడుతోంది. చివరకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసేస్తోంది. కాబట్టి బీజేపీ వాళ్లు ఏపీకి సారీ చెప్పాలి కదా.

కమలనాథులు ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. సో మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే ఏపీని కేసీయార్ ఒకరకంగా దెబ్బకొడుతుంటే, నరేంద్రమోడీ సర్కార్ మరోరకంగా దెబ్బకొడుతోంది. మోడీ, కేంద్రమంత్రులు ఏమొహాలతో ఏపీలోకి అడుగుపెడుతున్నారో కేసీయార్ కూడా అదే మొహంతో అడుగుపెడతారు.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

36 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

10 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago