అధికార పార్టీ నేతలు.. ప్రజలకు చేస్తున్న హెచ్చరికలు.. తీవ్ర వివాదానికి కారణమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని.. లేకపోతే.. పథకాలు ఆపేస్తామని.. నాయకులు తరచుగా హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలో ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా చేరిపోయారు. ఆయన కూడా ప్రజలను బెదిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రస్తుతం వైసీపీ నాయకులు గడపగడపకు కార్యక్రమానికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాయకులు.. ప్రభుత్వం అందిస్తున్న పథకాల వివరాలను ప్రజలకు వివరించి.. వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయాలని.. గత మూడేళ్లలో ప్రబుత్వం ఏం చేసిందో వివరించాలని.. సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు హితవు పలుకుతున్నారు. అయితే.. దీనికి భిన్నంగా నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పత్తిపాడులో గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే పర్వత.. ప్రజల్లోకి వెళ్లారు. ప్రబుత్వం ఏం చేసిందో వివరించారు.”జగనన్న ఇళ్ల పథకం” కింద ఇళ్లను ఇస్తున్నామని చెప్పారు. అయితే.. ఆయన ఇక్కడితో ఆగిపోలేదు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటేయాలని.. లేకపోతే.. పథకాలు నిలిచిపోతాయని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం తప్ప ఏ ఇతర ప్రభుత్వాలు వచ్చినా.. ప్రజలను పట్టించుకోవని.. కాబట్టి జగన్ సర్కారుకే ఓటేయాలని హెచ్చరించారు.. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
This post was last modified on October 7, 2022 6:00 pm
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…