Political News

ఢిల్లీకి ష‌ర్మిల: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలను ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారు. పార్టీల సంగ‌తి ప‌క్క‌న పెడితే..ప్ర‌జ‌లు సైతం ఆమెను ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి లేదు. దీంతో ఏదో ఒక ర‌కంగా.. మీడియాలో ఉండాల‌ని.. క‌వ‌రింగ్ పొందాల‌ని.. తెగ ఉబ‌లాట ప‌డుతున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలోనే తాజాగా ష‌ర్మిల‌.. ఢిల్లీ వెళ్లారు.

శుక్ర‌వారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారట‌. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరునున్నారట‌. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోట్లు దోచేసింద‌ని.. సో..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అభ్య‌ర్థించ‌నున్నార‌ట‌. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్‌ సర్కార్‌ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నార‌ట‌.

పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండ‌డంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిగానే గ‌మ‌నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేసిన‌.. షర్మిల ఇప్పుడు మ‌రి ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఆమె వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్ టీపీ నేతలు ఉన్నారు.

అయితే.. ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఎలాగూ సీబీఐ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు క‌దా.. మ‌రి ఏపీ సీఎం, మీ సోద‌రుడు.. జ‌గ‌న్ కేసులను కూడా కొంచెం త్వ‌ర‌గా.. విచారించ‌మ‌ని .. ‘నిజాల’ నిగ్గు తేల్చ‌మ‌ని.. కోరితే.. అప్పుడు మీ నిజాయితీ.. నిలువెత్తున న‌మ్ముతామ‌ని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. అంతో ఇంతో నీతిగా ఉండాల‌ని చెబుతున్నారు. మ‌రి ష‌ర్మిల ఈ ప్ర‌య‌త్నం చేస్తారో లేదో చూడాలి.

This post was last modified on October 7, 2022 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

16 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

22 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

53 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago