తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలను పట్టించుకునేవారే కరువయ్యారు. పార్టీల సంగతి పక్కన పెడితే..ప్రజలు సైతం ఆమెను పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. దీంతో ఏదో ఒక రకంగా.. మీడియాలో ఉండాలని.. కవరింగ్ పొందాలని.. తెగ ఉబలాట పడుతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల.. ఢిల్లీ వెళ్లారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్ను కలవనున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరునున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోట్లు దోచేసిందని.. సో..చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థించనున్నారట. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నారట.
పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా నెటిజన్లు కూడా ఆసక్తిగానే గమనిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసిన.. షర్మిల ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఆమె వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్ టీపీ నేతలు ఉన్నారు.
అయితే.. షర్మిల పర్యటనకు సంబంధించి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎలాగూ సీబీఐ దగ్గరకు వెళ్తున్నారు కదా.. మరి ఏపీ సీఎం, మీ సోదరుడు.. జగన్ కేసులను కూడా కొంచెం త్వరగా.. విచారించమని .. ‘నిజాల’ నిగ్గు తేల్చమని.. కోరితే.. అప్పుడు మీ నిజాయితీ.. నిలువెత్తున నమ్ముతామని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. అంతో ఇంతో నీతిగా ఉండాలని చెబుతున్నారు. మరి షర్మిల ఈ ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 7, 2022 5:28 pm
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి…
ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో కాపు, కమ్మ, రెడ్ల మధ్య రాజకీయాలు నడిస్తే ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం పూర్తిగా రెడ్ల…
ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…