తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలను పట్టించుకునేవారే కరువయ్యారు. పార్టీల సంగతి పక్కన పెడితే..ప్రజలు సైతం ఆమెను పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. దీంతో ఏదో ఒక రకంగా.. మీడియాలో ఉండాలని.. కవరింగ్ పొందాలని.. తెగ ఉబలాట పడుతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల.. ఢిల్లీ వెళ్లారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్ను కలవనున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరునున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోట్లు దోచేసిందని.. సో..చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థించనున్నారట. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నారట.
పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా నెటిజన్లు కూడా ఆసక్తిగానే గమనిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసిన.. షర్మిల ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఆమె వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్ టీపీ నేతలు ఉన్నారు.
అయితే.. షర్మిల పర్యటనకు సంబంధించి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎలాగూ సీబీఐ దగ్గరకు వెళ్తున్నారు కదా.. మరి ఏపీ సీఎం, మీ సోదరుడు.. జగన్ కేసులను కూడా కొంచెం త్వరగా.. విచారించమని .. ‘నిజాల’ నిగ్గు తేల్చమని.. కోరితే.. అప్పుడు మీ నిజాయితీ.. నిలువెత్తున నమ్ముతామని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. అంతో ఇంతో నీతిగా ఉండాలని చెబుతున్నారు. మరి షర్మిల ఈ ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 7, 2022 5:28 pm
ముందు సౌత్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడ్డ హీరోయిన్లు చాలామంది.. ఇక్కడి సినిమాలు, పరిస్థితుల గురించి విమర్శలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్కు ఉన్న వ్యతిరేకత ఎలాంటిదో తెలిసిందే. ‘జస్ట్ ఆస్కింగ్’…
పదేళ్లకు పైగా 33 మంది పసి బాలురపై పునరావృత లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ బందా ప్రత్యేక పోక్సో…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు…
గత ఏడాది మలయాళంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జనతా గ్యారేజ్, భాగమతి…
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…