Political News

ఢిల్లీకి ష‌ర్మిల: రాజకీయ వర్గాల్లో ఆసక్తి

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలను ప‌ట్టించుకునేవారే క‌రువ‌య్యారు. పార్టీల సంగ‌తి ప‌క్క‌న పెడితే..ప్ర‌జ‌లు సైతం ఆమెను ప‌ట్టించుకుంటున్న ప‌రిస్థితి లేదు. దీంతో ఏదో ఒక ర‌కంగా.. మీడియాలో ఉండాల‌ని.. క‌వ‌రింగ్ పొందాల‌ని.. తెగ ఉబ‌లాట ప‌డుతున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు. ఈ క్ర‌మంలోనే తాజాగా ష‌ర్మిల‌.. ఢిల్లీ వెళ్లారు.

శుక్ర‌వారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారట‌. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరునున్నారట‌. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోట్లు దోచేసింద‌ని.. సో..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అభ్య‌ర్థించ‌నున్నార‌ట‌. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్‌ సర్కార్‌ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నార‌ట‌.

పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండ‌డంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిగానే గ‌మ‌నిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేసిన‌.. షర్మిల ఇప్పుడు మ‌రి ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఆమె వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్ టీపీ నేతలు ఉన్నారు.

అయితే.. ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఎలాగూ సీబీఐ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు క‌దా.. మ‌రి ఏపీ సీఎం, మీ సోద‌రుడు.. జ‌గ‌న్ కేసులను కూడా కొంచెం త్వ‌ర‌గా.. విచారించ‌మ‌ని .. ‘నిజాల’ నిగ్గు తేల్చ‌మ‌ని.. కోరితే.. అప్పుడు మీ నిజాయితీ.. నిలువెత్తున న‌మ్ముతామ‌ని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు.. అంతో ఇంతో నీతిగా ఉండాల‌ని చెబుతున్నారు. మ‌రి ష‌ర్మిల ఈ ప్ర‌య‌త్నం చేస్తారో లేదో చూడాలి.

This post was last modified on October 7, 2022 5:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

12 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

56 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago