Political News

మునుగోడులో కాంగ్రెస్ తాజా వ్యూహం

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికలో పార్టీల స్పీడు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధిని ప్రకటించటంలో కేసీయార్ వెనకాముందు ఆడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రంగంలోకి దిగిపోయారట. ఒకపుడు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచింది. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయింది.

సరే ఇప్పటి పరిస్దితి ఏమిటంటే గెలవాలనే పట్టుదల ఒకవైపు, ఓడిపోతామేమో అనే టెన్షన్ మరోవైపు హస్తంపార్టీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోందట. అందుకనే కచ్చితంగా గెలవాల్సిందే అన్న పద్దతిలో ఈమధ్యే పరిస్దితిని సమీక్షించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే రివ్యూలో కొన్ని లోపాలు కనిపించాయట. బూత్ లెవల్ కమిటీల ద్వారా ప్రచారం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని నిర్ధారణకు వచ్చారట. అందుకనే రూటు మార్చేశారు.

ఇంతకీ ఆ కొత్త రూటు ఏమిటంటే బూత్ లెవల్ ప్రచారం కాకుండా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా టచ్ చేయాలని డిసైడ్ చేశారట. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించబోతున్నారట. 50 మంది ఓటర్లను ఒకటికి మూడుసార్లు టచ్ చేయాల్సిన ఇన్చార్జిలను తొందరలోనే ఫైనల్ చేయబోతున్నారు. దీనికి సంబందించిన బ్లూ ప్రింట్ పై గాంధీభవన్లో కసరత్తు జరుగుతోంది. ఇందులో కూడా ఆర్ధికంగా గట్టిగా ఉన్న నేతలనే ఇన్చార్జిలుగా నియమించాలన్నది కీలకమైన నిర్ణయమట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్ధిగా స్రవంతి పెద్ద గట్టి అభ్యర్దేమీ కాదు. ఎప్పుడో తన తండ్రి పాల్వాయి గోవర్ధనరెడ్డి ఐదుసార్లు గెలిచారు. ఆయన చనిపోయి కూడా చాలా కాలమైంది. కాబట్టి ఇప్పటి ఓటర్లకు గోవర్ధనరెడ్డి పేరు చెబితే పెద్దగా కనెక్టవ్వరు. ఇపుడు స్రవంతి గెలవటమన్నది అభ్యర్ధికన్నా రేవంత్ రెడ్డికే పెద్ద ప్రిస్టేజి అయిపోయింది. అందుకనే పార్టీ గెలుపుకోసం నానా అవస్తలు పడుతున్నారు.

This post was last modified on October 7, 2022 10:16 am

Share
Show comments

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

49 seconds ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago