Political News

అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది కేసీయార్ ?

కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళదాం అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లోకి. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటంలో తప్పులేదు కానీ సీమాంధ్రులంటూ నానా గోల చేసే వాళ్ళు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు జేఏసీ ఛైర్మన్ గా పనిచేసిన కోదండరామ్ మరికొందరు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.

అప్పటివరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళల్లో సీమాంధ్రులూ ఉన్నారు తెలంగాణా నేతలూ ఉన్నారు. కానీ తెలంగాణా డెవలప్ కాకపోవటానికి కేవలం సీమాంధ్ర ముఖ్యమంత్రులే కారణమంటూ నానా మాటలన్నారు. మరి తెలంగాణా నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య లాంటి వాళ్ళూ సీఎంలయ్యారు. పదుల సంఖ్యలో కేంద్ర మంత్రులుగా, వందల మంది రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. మరి వీళ్ళ హయాంలో తెలంగాణా ఎందుకు అభివృద్ధి జరగలేదు ?

అంటే అభివృద్ధి జరగటం లేదా జరగకపోవటం అన్నది తెలంగాణా పాలకులు లేదా సీమాంధ్ర పాలకుల మీద లేదు. స్ధానిక ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రుల కమిట్మెంట్ మీద ఆధారపడుంది. కానీ ప్రత్యేక తెలంగాణా సాధన కోసం అప్పట్లో కేసీయార్ సీమాంధ్రుల మీద విషం చిమ్మారు. పాలకులను తిట్టడంతో సరిపెట్టుకోకుండా సీమాంధ్ర సంస్కృతి, ఆహారం విషయంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అవసరమున్నా లేకపోయినా సీమాంధ్రలంటు బూతులు తిట్టారు.

అప్పట్లో సీమాంధ్రులను ఇన్ని రకాలుగా అవమానించిన కేసీయార్ ఇపుడు అదే సీమాంధ్రలో తన పార్టీ కోసం ఏ విధంగా పర్యటిస్తారు ? ఎన్నికలు వచ్చినపుడు తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లేయమని ఏ విధంగా అడగ్గలరు ? అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది ? రాష్ట్రం విడిపోయి రెండు ఎన్నికలు జరిగినా ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదంటే అందుకు కేసీయారే కారణమని సీమాంధ్ర జనాలు నమ్ముతున్నారు. మరీ ప్రశ్నలకు కేసీయార్ సమాధానం చెబుతారా ?

Satya

Recent Posts

విద్యాశాఖ‌ విజేత‌… నారా లోకేష్‌!

విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…

13 minutes ago

ఉపముఖ్యమంత్రి పవన్… ఎన్నడూ హద్దులు దాటలేదు!

రాష్ట్రంలో కూట‌మిప్ర‌భుత్వంఏర్ప‌డి జూన్ 12కు రెండేళ్లు పూర్త‌య్యాయి. 2024లో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వంలో ఉప‌ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌ట్టారు జ‌న‌సేన అధినేత…

1 hour ago

ఆ ఇద్దరి చేతికి బేడీలు

ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…

2 hours ago

రవితేజ అలాంటి సినిమా చేస్తాడా?

తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…

7 hours ago

బీజేపీ ఖాతాలోకి మీనాక్షి సీటు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…

10 hours ago

అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు

కొన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మొద‌లైన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్‌లో అభిమానుల ఆకాంక్ష‌లు, అంచ‌నాల‌కు త‌గ్గ సినిమాలు…

12 hours ago