ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. కారణం ఏమిటంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే. దీనికన్నా ఇంకా పెద్ద సర్ ప్రైజ్ ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలోకి దిగుతుండటమే. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు అలాగే జనాలు ఈ రెండు విషయాలను ఏమాత్రం ఊహించలేదు. ఉద్యమ నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏమీలేదు. కాకపోతే గద్దర్ ఎన్నికల్లో పోటీ చేస్తారని అదీ ప్రజాశాంతి పార్టీ తరపున దిగుతారని మాత్రం అనుకోలేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే గద్దర్ మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని అనుకుంటే టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలే అవకాశమిచ్చేవేమో. లేకపోతే వామపక్షాల తరపున పోటీచేయాలని అనుకున్నా సీపీఐ+సీపీఎం కలిసి గద్దర్ కు మద్దతుగా నిలిచేవేమో. ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేయటం కన్నా వామపక్షాల తరపున పోటీచేయటం మంచిదే కదా. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ ని జనాలెవరూ ఒక రాజకీయ పార్టీగా చూడటం లేదు. దాని వ్యవస్థాపక అధ్యక్షుడు, మత ప్రభోదకుడు కేఏ పాల్ ను కమెడియన్ గానే చూస్తున్నారు.
పార్టీ విషయాన్ని గానీ లేదా కేఏ పాల్ వైఖరిని కానీ గద్దర్ గమనించకుండానే ఉంటారా ? కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా బాగానే ఉంటుంది కదానే చర్చలు మొదలయ్యాయి. అంటే ప్రజాశాంతి పార్టీపై జనాల్లో ఎలాంటి భావనుందో అందరికీ అర్ధమవుతోంది. గద్దర్ అనే వ్యక్తి సమాజంలో చాలా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దశాబ్దాల పాటు ఉద్యమ నేపథ్యంలో పనిచేసి, ప్రజాగాయకుడిగా గద్దర్ ఎంతో పాపులర్. ఏ పార్టీ తరపున పోటీచేసినా తనను తాను జనాలకు పరిచయటం చేసుకునే విషయంలో గద్దర్ కష్టపడక్కర్లేదు. ఇన్ని అవకాశాలను వదిలేసి కేఏ పాల్ పార్టీ తరపున పోటీ చేస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గద్దర్ వల్ల పార్టీకి ప్రచారం రావాలే కానీ పార్టీవల్ల గద్దర్ కు జరిగే ఉపయోగం ఏమీలేదన్నది నూరుశాతం వాస్తవం.
This post was last modified on October 6, 2022 11:39 am
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…