విజయదశమి పండుగనాడు జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా కొనసాగుతుందని అన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ అని, కానీ తనకు మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వల్లే రైతాంగం నానా ఇబ్బందులు పడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు.
మోడీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం, రైతుల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తాను దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించానని, ఆ సందర్భంగా టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేయవద్దని చాలామంది తనను కోరారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
ముందుగా కర్ణాటక, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలవుతాయని కేసీఆర్ అన్నారు. ఇక, యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నారని, అందుకే ఈ సమావేశానికి ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావద్దని చెప్పామని అన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు చెందిన నేతలందరూ తనతో జతకడతారని కేసీఆర్ అన్నారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…