కేసీయార్ ఏర్పాటు చేయబోయే కొత్త జాతీయపార్టీలోకి చేరే నేతల్లో మొదటి వికెట్ కాంగ్రెస్ నుండి పడింది. ఈమధ్యనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదేలు తాజాగా తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోయారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్లో కేసీయార్ ను కలిసి ఓదేలు తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ సమక్షంలో కారు కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని కేసీయార్ ను కోరారు.
జాతీయపార్టీకి ఇందుకు అవసరమైన సాంకేతిక వ్యవహారాలను ఒకవైపు చేస్తునే మరోవైపు రాజకీయపరమైన వ్యవహారాల్లో స్పీడు పెంచారు. జాతీయపార్టీగా ప్రకటించే కార్యక్రమానికి దేశంలోని అనేక పార్టీలకు చెందిన ప్రముఖులను, వివిధ రంగాల్లో నిపుణులను ఆహ్వానించారు. వారిలో కొందరు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు.
ఇందులో భాగంగానే జాతీయపార్టీలో చేరాలని స్వయంగా కేసీయార్ కొందరికి ఇప్పటికే ఫోన్లుచేసి ఆహ్వానించారు. మరికొందరికి తన సన్నిహితుల ద్వారా ఫోన్లలో మాట్లాడిస్తున్నారు. ముందుగా ఏపీలోని కాంగ్రెస్, టీడీపీ నేతలతో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పై రెండుపార్టీల నేతలతో కేసీయార్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. అలాగే పై రెండుపార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరిన నేతల ద్వారా గాలమేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎవరు మాట్లాడారో ఏమో తెలీదు కానీ తెలంగాణాలోని మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ఎంఎల్ఏగా పనిచేసిన నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. ఓదేలు ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి ప్రియాంకగాంధి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కేసీయార్ జాతీయపార్టీలో చేరటంకోసమన బుధవారం ఉదయం ప్రగతిభవన్ కు వెళ్ళి మళ్ళీ కారెక్కేశారు. సో కేసీయార్ ఏర్పాటుచేయబోయే జాతయపార్టీలో చేరిన మొదటి నేత అవుతారేమో.
This post was last modified on October 6, 2022 11:31 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…