కేసీయార్ కొత్తపార్టీ కలకలం రేపుతున్నట్లుంది. కొత్తపార్టీ రేపుతున్న కలకలం తెలంగాణాలో కన్నా ఏపీలోనే ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణాలో టీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఇతర పార్టీల నుండి వచ్చి జాతీయపార్టీలో చేరబోయే నేతలు పెద్దగా ఉండరు. ఎందుకంటే జాతీయపార్టీలో పనిచేయటానికి తెలంగాణాలోనే కావాల్సినంత మంది నేతలున్నారు. కొత్తగా ఏర్పాటవ్వబోయే జాతీయపార్టీలో పనిచేయటానికి మిగిలిన రాష్ట్రాల్లోనే నేతల అవసరం చాలావుంది.
మిగిలిన రాష్ట్రాల్లో జాతీయపార్టీ పరిస్ధితి ఎలాగున్నా ఏపీలో కీలకంగా మారబోతోంది. ఎందుకంటే పొరుగునున్న ఏపీలోనే కేసీయార్ పార్టీకి ఆధరణ లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకుంటుంది ? అనే ప్రశ్నలు మొదలవుతాయి. అందుకనే కేసీయార్ పర్సనల్ గా ఏపీలోని వివిధ పార్టీల నేతలకు గాలమేస్తున్నారట. కాంగ్రెస్, టీడీపీల్లోని తన సన్నిహితుల్లో కొందరికి తానే నేరుగా ఫోన్లు చేసి మాట్లాడారట. మరికొందరికి తన సన్నిహితుల ద్వారా మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా ఫోన్లు అందుకున్నవారిలో అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు కాకుండా పై రెండు పార్టీల్లోని చాలామందితో టీఆర్ఎస్ ముఖ్యులు టచ్ లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలు కేసీయార్ పార్టీలోకి మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంతకాలం కాంగ్రెస్ లో ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని ఇప్పటికే అర్ధమైపోయింది.
ఉపయోగం లేని పార్టీలో ఉండేబదులు కనీసం కొత్తపార్టీలో చేరితో ఏమైనా భవిష్యత్తు ఉంటుందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా ఈ పాయింట్ మీద కేసీయార్ అయినా టీఆర్ఎస్ సీనియర్లైనా కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలమేస్తున్నారట. మరి ఆ గేలానికి తగులుకునే వాళ్ళు ఎవరో తెలీటం లేదు. ఒక్కోసారి కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తుండటంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగుతోంది.
This post was last modified on October 6, 2022 11:32 am
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…