భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అనే హిందూ అతివాది హతమార్చిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో గాంధీజీని కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో జాతిపితకు ఘోర అవమానం జరిగింది.
గాంధీజీని మహిషాసురుడుగా చూపిస్తూ తయారు చేసిన విగ్రహాన్ని ఆ పూజలో పెట్టడం వివాదాస్పదమైంది. ఓ మండపంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మహిషాసురుడికి గాంధీముఖాన్ని పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసుల ఆదేశాల ప్రకారం నిర్వాహకులు గాంధీజీ ముఖాన్ని తొలగించారు. ఈ చర్యను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.
ఈ క్రమంలోనే, ఈ వ్యవహారంపై అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి స్పందించారు. ఆ విగ్రహంలో గాంధీజి తల పొరపాటున వచ్చిందని, పోలీసులు చెప్పడంతో దానిని తాము వెంటనే తొలగించామని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. అయితే, కావాలనే ఆ విగ్రహంలో గాంధీజీ తలను పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విగ్రహం తయారీదారులు ఇలా చేయరని, కొందరు గాంధీ వ్యతిరేక నేతలు ఇలా చేయించి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 3, 2022 7:38 pm
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…