Political News

గాంధీజీ రాక్షసుడిగా దుర్గా మాత విగ్రహం..వివాదం

భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అనే హిందూ అతివాది హతమార్చిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో గాంధీజీని కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో జాతిపితకు ఘోర అవమానం జరిగింది.

గాంధీజీని మహిషాసురుడుగా చూపిస్తూ తయారు చేసిన విగ్రహాన్ని ఆ పూజలో పెట్టడం వివాదాస్పదమైంది. ఓ మండ‌పంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మ‌హిషాసురుడికి గాంధీముఖాన్ని పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసుల ఆదేశాల ప్రకారం నిర్వాహకులు గాంధీజీ ముఖాన్ని తొలగించారు. ఈ చ‌ర్య‌ను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.

ఈ క్రమంలోనే, ఈ వ్యవహారంపై అఖిల భార‌త‌ హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి స్పందించారు. ఆ విగ్రహంలో గాంధీజి తల పొరపాటున వచ్చిందని, పోలీసులు చెప్పడంతో దానిని తాము వెంటనే తొలగించామని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. అయితే, కావాలనే ఆ విగ్రహంలో గాంధీజీ తలను పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విగ్రహం తయారీదారులు ఇలా చేయరని, కొందరు గాంధీ వ్యతిరేక నేతలు ఇలా చేయించి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on October 3, 2022 7:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెనిన్ తగ్గట్లేదు… మరి పెద్ది సంగతేంటి

లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…

29 minutes ago

గాయపడ్డ సింహాన్ని ఆపేయమన్న ప్రభుత్వం?

ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…

1 hour ago

ఆషురెడ్డి ఆడియో వైరల్

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి పేరు గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్‌కు…

2 hours ago

ఫ‌రియా అబ్దుల్లా తండ్రి అలా… త‌ల్లి ఇలా

జాతిర‌త్నాలు సినిమాతో క‌థానాయిక‌గా చాలా మంచి పేరు సంపాదించింది హైద‌రాబాద్ అమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. లోక‌ల్ హీరోయిన్ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం…

9 hours ago

రవిబాబు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కానీ

మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల…

11 hours ago

క‌న్నీళ్ల‌తో ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్త‌రాది అమ్మాయి పాయ‌ల్ రాజ్‌పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయ‌ల్…

13 hours ago