జాతీయ పార్టీ పెట్టి నేషనల్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ ఒంటరి పోరాటం చేయాలని అనుకుంటున్నారా ? అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో, సీనియర్ నేతలతో కేసీయార్ ఈరోజు అంటే ఆదివారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు అందుకు అవసరమైన సన్నాహాలన్నింటినీ కేసీయార్ చేస్తున్నారు.
సరే జాతీయ పార్టీ పెట్టిన తర్వాత 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే కొత్తపార్టీతో పొత్తులు పెట్టుకోవటానికి మిగిలిన పార్టీలు పెద్దగా ఆసక్తిచూపవు. అందుకనే పూర్వ నిజాం స్టేట్ అయిన తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారట. కర్నాటకలో బహుశా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్, కొన్ని రైతు సంఘాలు మద్దతు చెప్పాయంటున్నారు.
అలాగే మహారాష్ట్రలో రాజకీయ పార్టీలేవీ మద్దతు చెప్పకపోయినా కొన్ని రైతు సంఘాలతో ఇప్పటికే కేసీయార్ భేటీ అన్నీ విషయాలను చర్చించారట. కాబట్టి రైతుసంఘాల నేతలు ఎవరైనా కేసీయార్ తో చేయికలిపే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఈమధ్యనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో కూడా భేటీ అయ్యారు. నిజానికి 80 ఏళ్ళకు పైబడిన వాఘేలా అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయారు. కేసీయార్ తో భేటీఅయిన రైతుసంఘాల నేతలకు జనాల్లో ఏ మేరకు పట్టుందో ఎవరికీ తెలీదు.
ఇక కర్నాటకలో దేవేగౌడ లేస్తే కూర్చోలేరు. ఆయన కొడుకు, మాజీ సీఎం కుమారస్వామికి రాష్ట్రంపై పెద్దగా పట్టులేదు. సరే కేసీయార్ ఈరోజు పార్టీ పెట్టేయగానే పోలోమంటు జనాలొచ్చి ఓటలేసేస్తారని ఎవరు అనుకోవటంలేదు. మొదట్లో బీజేపీ కూడా దశాబ్దాల పాటు ఓట్లు, సీట్లు లేక నానా అవస్తలు పడిన పార్టీయే. కేసీయార్ జాతీయపార్టీ భవిష్యత్తు 2023 షెడ్యూల్ ఎన్నికలపైనే ఆధారపడుంది. వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వస్తే జాతీయపార్టీ భవిష్యత్తుకు పర్వాలేదు. లేకపోతే మాత్రం పురిటిలోనే దెబ్బపడిపోతుంది.
This post was last modified on October 2, 2022 10:34 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…