Political News

రాజ‌కీయాల్లోకి వివేకా కుమార్తె.. ఇంకా క్వ‌శ్చ‌న్ మార్కేనా?

మాజీ మంత్రి, అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన‌ వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె.. సునీత రెడ్డి.. గురించి ఎప్పుడూ.. వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారని.. పోటీకి రెడీ అవుతున్నార‌ని.. వార్తలు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం.. గ‌తంలో ఒక‌సంద‌ర్భంలో వైసీపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల చేసిన కామెంట్లే. “ఈ ప‌రిణామాలు చూస్తుంటే.. ఆమెను.. రాజ‌కీయాల్లోకి తెచ్చేలా ఉన్నారు” అంటూ.. టీడీపీపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఎందుకంటే.. అప్ప‌ట్లో టీడీపీ ఈ కేసు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించింది. దీంతో స‌జ్జ‌ల కామెంట్లు చేశారు. మ‌రోవైపు.. సునీత .. ఈ కేసు విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైకోర్టులో సీబీఐకి అప్ప‌గించాల‌ని.. పిటిష‌న్ వేసి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. తాజాగా.. ఈ కేసు విచార‌ణ ముందుకు సాగ‌డం లేద‌ని.. పొరుగు రాష్ట్రాల్లో విచారించేలా .. ఆదేశించాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టుకు వెళ్లారు.

అంటే.. సునీత పోరాటం తీవ్రంగానే ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఆమెకు కుటుంబం ప‌రంగా ఎలాంటి స‌హ‌కారం లేద‌నేది కూడా వాస్త‌వం. అందుకే.. రాజ‌కీయంగా ముందుకు వ‌స్తే.. ఆమెకు న్యాయం జ‌రుగుతుంద‌ని.. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడా ఉంటుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. దీనిపై ఎక్క‌డా.. వివేకా కుమార్తె.. బ్లాస్ట్ కావ‌డం లేదు. అయితే.. అలాగ‌ని.. ఎక్క‌డా.. ఆమె రాజ‌కీయాల్లోకి రాన‌ని మాత్రం చెప్పడం లేదు.

ఇదిలావుంటే.. సునీత రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటే.. ఆహ్వానించేందుకు.. ఏయే పార్టీలు రెడీగా ఉన్నాయ‌నే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీ ముందున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా జ‌న‌సేన కూడా రెడీగానే ఉంద‌నే సంకేతాలు ఇస్తోంది. ఎందుకంటే.. జ‌న‌సేనాని కూడా.. ప‌లు మార్లు ఈ కేసులో సునీత‌కు అన్యాయం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. సో.. ఈ రెండు పార్టీలు కూడా.. సునీత‌ను అక్కున చేర్చుకునేందుకు రెడీగానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు. మ‌రి ఏం నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

4 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

6 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

6 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

8 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

11 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

12 hours ago