కొద్ది రోజుల క్రితం టీడీపీతో పొత్తుల వ్యవహారంపై ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ప్రధాని మోడీ రహస్య భేటీ జరిపారని టాక్ వచ్చింది. దాంతోపాటు, హైదరాబాద్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పొత్తులపై చర్చించారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, సమయం, సందర్భాన్ని బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు తెరపడినట్లు అయింది.
ఇటువంటి తరుణంలో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో తప్ప మరే పార్టీతో తమకు పొత్తులేదని లక్ష్మణ్ కుండ బద్దలుకొట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగడంలేదని, బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని లక్ష్మణ్ అన్నారు.
ఇక, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని లక్షణ్ చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కూడా మరోసారి బీజేపీ ప్రభుత్వం ఉంటుందని, ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలే ఉండబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు ఉండదు అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…