రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అనేది పాత సామెత. ఇపుడు రాజు తలచుకుంటే సొంత విమానానికి కొదవా అని చెప్పుకోవాలేమో. కేసీయార్ తొందరలోనే సొంత విమానం కొనుగోలు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అవసరాల కోసం సొంత విమానం ఉండాలని సీఎం డిసైడ్ అయ్యారట. తొందరలోనే టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
తొందరలోనే జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటనలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. మరి అనుకున్నప్పుడల్లా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలంటే విమానాలు అందుబాటులో ఉండవు కదా. అలాగే ప్రతిసారి ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. అద్దెకు విమానం తీసుకోవటం కేసీయార్ కు పెద్ద కష్టమేమీకాదు. కానీ అద్దెలు చెల్లించే బదులు ఏకంగా సొంత విమానాన్నే కొనేస్తే పోలా అద్దిరిపోలా అని అనుకున్నారట.
దాంతో 15 సీట్ల కెపాసిటీ ఉన్న విమానం గురించి ఆరాతీస్తే రు.85 కోట్లవుతుందని చెప్పారట. తనకు కావాల్సిన పద్దతిలో ఇంటీరియర్ తీర్చిదిద్దుకుంటే సరిపోతుందని అనుకున్నారు. ఎప్పుడైతే కేసీయార్ ఆలోచన పార్టీ నేతలకు తెలిసిందే విరాళాలు ఇచ్చేందుకు పోటీపడుతున్నారట. ఇప్పటికే పార్టీ ఖాతాలో రు. 865 కోట్లున్నాయి. అయితే పార్టీ డబ్బులతో అవసరం లేకుండా తామే విరాళాలు ఇవ్వటానికి పోటీలు పడుతున్నారట.
ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కదా టికెట్లు గట్రా వ్యవహారాలు చాలా ఉంటాయి. చాలా నియోజకవర్గాల్లో ఒకరికి మించి టికెట్ల కోసం పోటీలు పడుతున్నారు. ఎంఎల్ఏలకు కచ్చితంగా టికెట్లు రావని అనుకున్న నియోజకవర్గాల్లో చాలామంది నేతలు పోటీలు పడుతున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో ఆశావహులు విమానం కొనుగోలుకు విరాళాలు ఇవ్వటానికి పోటీలు పడుతున్నారట. కాబట్టి విరాళాలకు కొదవుండదు కాబట్టి తొందరలోనే విమానం కొనేయటం ఖాయం.
This post was last modified on September 30, 2022 10:47 am
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…