గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నానిపై టీడీపీ నేతలు కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ కొడాలి నాని చేసే అసభ్యకర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చి సైలెంట్ అయ్యే టీడీపీ నేతలు..ఇటీవలి కాలంలో కొడాలి నానిపై కేసు పెట్టే వరకూ వెళ్లారు.
ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారట. నాని ఓటమే లక్ష్యంగా ఆపరేషన్ కొడాలి నానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారట. అయితే, గుడివాడలో పాతుకుపోయిన కొడాలి నానిపై పోటీ చేసేందుకు ఎవరిని రంగంలోకి దింపాలి అని చంద్రబాబు ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారట. గుడివాడలో టీడీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అక్కడ కొడాలి నానిని దీటుగా ఎదురుకోగల్గిన నేతకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
వాస్తవానికి వంగవీటి రాధాను…కొడాలి నానిపై పోటీకి దించాలని గతంలో చంద్రబాబు భావించారట. అయితే, కొడాలి నాని…రాధాల మధ్య స్నేహబంధం మరింత బలపడడంతో ఆ ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొడాలి నానిపై పోటీకి తాను సిద్ధమంటూ ప్రకటించిన దేవినేని ఉమకే గుడివాడ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్నా సరే కొడాలి నానిని ఓడించాలని పవన్ కళ్యాణ్ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఉమ అభ్యర్థిత్వాన్ని పవన్ కూడా బలపరుస్తారని అనుకుంటున్నారట.
పొత్తు కుదిరితే గుడివాడ టికెట్ ను జనసేన వదులుకునేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అనుకుంటున్నారట. ఆపరేషన్ కొడాలి నాని సక్సెస్ అవుతుందా? కొడాలికి దేవినేని చెక్ పెడతారా? చంద్రబాబు, టీడీపీ నేతల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
This post was last modified on September 29, 2022 10:21 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…