Political News

నెర‌వేరని శుభ‌సంక‌ల్పాలు ఎన్నో.. జ‌గ‌న్‌కు19 నెల‌లే గ‌డువు..!


సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో 19 మాసాలే గ‌డువు ఉంద‌ని.. నాయ‌కులు రెడీ కావాల‌ని..ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలు ఎక్కాల్సిందేన‌ని.. నాయ‌కుల‌కు తేల్చిచెప్పారు. అయితే.. ఈ గ‌డువు.. ఒక్క ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు మాత్ర‌మే కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం జ‌గ‌న్‌కు కూడా 19 మాసాలే గ‌డువు ఉంద‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న ఇచ్చిన హామీల్లో నెర‌వేర‌ని.. నెర‌వేర్చ‌ని శుభ‌సంక‌ల్పాలు అనేకం ఉన్నాయ‌ని చెబుత‌న్నారు.

వాటిని నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం.. కూడా ఉంద‌ని.. లేక‌పోతే.. ప్ర‌జ‌లు రేపు నిల‌దీస్తార‌ని అంటున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌ను.. లేదాహామీల‌ను నెర‌వేర్చేందుకు సీఎం జ‌గ‌న్‌కు ఉన్న గ‌డువు కూడా కేవ‌లం 19 మాసాలేన‌ని చెబుతున్నారు. వీటిలో ప్ర‌ధానంగా.. పోల‌వ‌రం పూర్తి వెంటాడుతోంది. తాను అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే దీనిని పూర్తిచేస్తామ‌న్నారు. ఇది సాధ్యం కావ‌డం లేదు. విశాఖ‌కు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వ‌రు.. చంద్ర‌బాబు అడ‌గ‌డం లేదు.. అన్నారు. ఇప్పుడు అది ఎక్క‌డ ఉండాలో అక్క‌డే ఉంది.. త‌ప్ప అంగుళం కూడా ముందుకు జ‌ర‌గ‌లేదు.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేసిన‌.. క‌డ‌ప ఉక్కుప‌రిశ్ర‌మ‌ను కాద‌ని.. తాను స్వ‌యంగా శంకుస్తాపన చేశారు. అయితే.. అది కూడా.. అక్క‌డి నుంచి ఒక్క అడుగు ముందుకు ప‌డ‌డం లేదు. వెనుక‌బ‌డిన జిల్లాల‌కు.. ఇచ్చిన హామీలు కూడా అలానే ఉన్నాయి. ఉద్ధానంలో కిడ్నీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తాన‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ లేదు. ఇవ‌న్నీ ఇలా.. ఉంటే.. మ‌రోవైపు.. ప్ర‌త్యేక హోదా సాధ‌న ఇంకా ‘ప్లీజ్’ గేట్ దాట‌లేదు. మ‌రి వీటిని సాధించ‌కుండా.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం సాధ్య‌మేనా.. వెళ్లినా.. ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారు? అనేది ప్ర‌శ్న‌.

నిజానికి… వైసీపీ నాయ‌కులు త‌ప్పించుకునేందుకు చాలానే అవ‌కాశాలు దారులు ఉన్నాయి. మా సీఎం మాకు డ‌బ్బులు ఇవ్వ‌లేదు..కాబ‌ట్టి.. మేం ప‌నులు చేయ‌లేక పోయాం.. అని వారు చెప్పి త‌ప్పించుకునే అవ‌కాశం ఉంది. కానీ, జ‌గ‌న్ అలా చెప్పేందుకు చాన్స్ లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కే ఈ 19 నెల‌లు అత్యంత కీల‌క‌మ‌ని. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మెప్పించేందుకు ఆయ‌నకే చాలా త‌క్కువ స‌మ‌యం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on September 29, 2022 10:16 pm

Share
Show comments

Recent Posts

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…

35 minutes ago

‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్

తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…

1 hour ago

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

3 hours ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

7 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

12 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

13 hours ago