ప్రముఖ సినీనటుడు ఆలీ వైసీపీలో ఇమడలేకపోతున్నట్లున్నారు. పార్టీలో చేరగానే తనకేదో బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చేస్తుందని, పెద్ద పదవేదో ఇచ్చేస్తారని ఆశించి ఆలీ వైసీపీలో చేరారు. అయితే రోజులు గడుస్తున్నాయే కానీ పదవి కానీ ఆశించిన గుర్తింపు కానీ రావటం లేదు. దాంతో ముందు ముందు వస్తుందనే నమ్మకం కూడా తగ్గిపోతున్నట్లుంది. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక పార్టీ మారితే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారట.
తనకు బాగా సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరమని కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహాను పరిశీలిస్తున్నారట. అయితే జనసేనలో కూడా ఏపాటి ఆధరణ ఉంటుందనే విషయంలోనే కాస్త వెనకాడుతున్నట్లు సమాచారం. గతంలో ఆలీ టీడీపీలో కూడా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే అందులో సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితోనే పార్టీ మారారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుండటంతో దిక్కుతోచటం లేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీలోకి రమ్మని ఆలీని ఎవరు పిలవలేదు. తనంతట తానుగానే ఏదో ఆశించి వైసీపీలో చేరారు. ఏదో ఆశించే చేరారు కాబట్టి ఆశించింది దక్కకపోవటంతో అసంతృప్తి మొదలైంది. ఇందులో మీడియా పాత్రకూడా చాలానే ఉంది. ఒకసారి జగన్ ను కలవగానే ఇంకేముంది ఆలీకి రాజ్యసభ ఖాయమని ఒకసారి, ఆలీకి ఎంఎల్సీ విషయంలో జగన్ హామీ ఇచ్చారని మరోసారి ఒకటే ఊదరగొట్టేసింది. మీడియాలో వచ్చినవేవీ దక్కకపోవటంతో అసంతృప్తి పెరుగుతోంది.
ఆలీ తెలుసుకోవాల్సిందేమంటే ఆలీకన్నా ముందునుండే పోసాని కృష్ణమురళి, విజయచందర్, పృధ్వి, మోహన్ బాబు లాంటి వాళ్ళు పనిచేశారు. పృధ్వికి ఎస్వీబీసీ ఛైర్మన్ ఇచ్చినా నిలుపుకోలేకపోయారు. మోహన్ బాబుకు పదవేమీ దక్కలేదు. విజయచందర్ కు ఎఫ్డీసీ ఛైర్మన్ దక్కటం పదవీ కాలం ముగియటం కూడా అయిపోయింది. తాను ఏ పదవీ ఆశించి పార్టీలో చేరలేదని చెప్పారు కాబట్టి పోసానితో సమస్య లేదు. ఎటొచ్చీ ఏదో ఆశించి పార్టీలో చేరారు కాబట్టే ఆలీలో అసంతృప్తి పెరిగిపోతోంది. మరి జనసేనలో అయినా తాను ఆశించింది దక్కుతుందేమో చూడాలి. పైగా గతంలో పవన్ ను తక్కువ చేసి మాట్లాడాడు.. మరి పార్టీలో ఎంట్రీ దక్కుతుందా?
This post was last modified on September 29, 2022 10:44 am
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…
తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ.…
బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా…
వైసీపీ నేతలపైనా.. ఆ పార్టీ అధినేత జగన్పైనా సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం కోల్పోయినప్పుడు కూడా…