ఏదేమైనా.. ఎవరు ఎన్ని అన్నన్నా.. నిజాలు గడపదాటే లోపే.. అబద్ధం ఊరు చుట్టివస్తుందనేది సామెత. ఇది వాస్తవం కూడా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇలాంటివి కామన్గా కూడా మారిపోయాయి. ఇప్పుడు మూడు రాజధానుల విషయంపైనా.. అదే జరుగుతుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల కోసం పట్టుబట్టింది. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. చెబుతోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో అనేక అబద్ధాలను పోగేసి.. చెప్పినా.. చెప్పే సాహసం చేయొచ్చు. నిజానికి ప్రతిసారీ అసెంబ్లీ లో మూడు రాజధానులపై చర్చ వచ్చినప్పుడు.. అమరావతిలో రైతులను మోసం చేసి.. టీడీపీ నేతలు కొన్నారని.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇది నిజమే అనుకుంటే.. దీనిని కోర్టుల్లో ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు.. ఇది నిలబడలేదు కదా. అంటే.. ఈ అబద్ధాలు న్యాయ వ్యవస్థ ముందు పల్టీ కొట్టాయికదా!
అయినా.. ప్రజలను నమ్మించేందుకు ఈ సీన్ను మరింతగా ముందుకు తీసుకువెళ్తోంది వైసీపీ. అందుకే.. చెప్పిందేచెప్పి.. పాడిందే పాడి..పిల్లి పిల్లను. పులి పిల్లగా మార్చే ప్రయత్నం చేస్తోదనే వాదన వినిపిస్తోంది. మరి.. ఈ వ్యూహం.. ప్రజల్లోకి వెళ్లకముందే.. వారు అవాస్తవాలను నమ్మకముందే.. టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని.. మరింత వ్యూహాత్మకంగా ప్రజలను కలిసి.. అసలు రాజధానిపై ఏం జరిగిందనే వాస్తవాలను వారికి వివరించాలని.. మేధావులు సూచిస్తున్నారు.
అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఎలా తొక్కేసిందో.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ ఉద్దే శంతో ఇక్కడ రాజధానిని నిర్మించాలని అనుకుందో.. కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెబుతున్నారు. రాజధానితో ఏవర్గానికి ఎలాంటి మేలు సమకూరుతుందో వివరించాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు ఆదిశగా అడుగులు వేస్తారో..లేదో .. చూడాలి.
This post was last modified on September 26, 2022 5:03 pm
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…