రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధానిగా చంద్రబాబునాయుడు అండ్ కో కీలకమైన ఎజెండాగా చేసుకునే అవకాశముంది. ఇలాంటి నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానులే తమ ఎజెండాగా ఎన్నికల నినాదం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే తొందరలో మూడు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలును జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇపుడు అసెంబ్లీ ఉన్న అమరావతే శాసన రాజధానిగా కంటిన్యూ అవుతుందని జగన్ ప్రకటించారు. దీన్ని ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వ్యతిరేకతను ప్రదర్శించటంలో భాగంగా అమరావతి రైతులు పాదయాత్ర కూడా చేస్తున్నాయి.
సరిగ్గా దీనికి కౌంటరుగా అన్నట్లు తొందరలోనే అంటే వైజాగ్, కర్నూలు, విజయవాడల్లో భారీ బహిరంగసభలు నిర్వహించాలని జగన్ డిసైడ్ అయ్యారు. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎందకు ఎంపికచేసినట్లు ? దానివల్ల జరిగే నష్టాలేమిటి ? అనేది తన కోణంలో జగన్ చెప్పబోతున్నారట. ఇదే సమయంలో తాను మూడు రాజధానుల కాన్సెప్టును ఎందుకు తీసుకొచ్చినట్లు ? తన కాన్సెప్టువల్ల రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు ఎలాగ అభివృద్ధి జరుగుతుందనే విషయాలను వివరించబోతున్నారట.
రాజధాని ఏర్పాటుకు సంబందించి గతంలో శివరామకృష్ణన్ కమిటి ఏమి చెప్పింది? అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ చెప్పిందేమిటి అనే విషయాలను కూడా జనాలకు వివరించబోతున్నారు. మొత్తానికి జగన్ నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగసభల్లో వైజాగ్, కర్నూలు జనాలకు బాగా కనెక్టవుతామనే నమ్మకంతో ఉన్నారు జగన్.
అయితే గతంలో అమరావతి పాదయాత్ర జరిగినపుడు తిరుపతిలో పెట్టిన మూడు రాజధానుల సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరి ఇపుడు జగన్ పెట్టే సభలు విజయవంతం అవుతాయా? చూడాలి ఏం జరుగుతుందో.
This post was last modified on September 26, 2022 2:50 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…