Political News

ఇందుకే వీళ్ళిద్దరినీ నమ్మటం లేదా ?

జాతీయ స్ధాయిలో ఎన్టీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాన్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తూట్లు పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల అధినేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి ఐఎన్ఎల్డీ పార్టీ ఒక ప్రయత్నం జరిగింది. హర్యనాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, ర్యాలీ జరిగింది. జయంతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాల నేతలందరినీ ఐఎన్ఎల్డీ పిలిచింది.

అయితే ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి చాలామంది నేతలు హాజరైనా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ హాజరు కాలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వీళ్ళిద్దరు గైర్హాజరైనట్లు అర్ధమైపోతోంది. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ప్రతిపక్షాల ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని బహిరంగ సభలో మాట్లాడిన నేతలంతా పదే పదే చెప్పారు. ఒక జాతీయ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకుని పోవాల్సిందే అని బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గట్టిగా చెప్పారు.

ఇక్కడే మమత, కేసీయార్ కు సమస్య వస్తోంది. వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ తో కలిసి పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. శరద్ పవార్ తో భేటీలో కాంగ్రెస్ తో చేతులు కలపడానికి మమత ఇష్టపడినా మళ్ళీ ఎందుకనో ఈ కార్యక్రమంలో హాజరుకాలేదు. కాంగ్రెస్ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనటం ఇష్టంలేకే వాళ్ళిద్దరు హాజరుకాలేదని అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి ఇదే విధమైన వైఖరిని ముందు ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంది.

మమత, కేసీయార్ కున్న లోకల్ సమస్యల కారణంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇంత స్పష్టంగా వీళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అయినా ప్రజా ఫ్రంట్ అయినా ఎలా సక్సెస్ అవుతుందన్నది అసలు పాయింట్. ఇలాంటి కారణాలతోనే మమత, కేసీయార్ ను చాలా పార్టీలు నమ్మటం లేదు.

This post was last modified on September 26, 2022 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

30 minutes ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

3 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

4 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

5 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

6 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

7 hours ago