Political News

ఇందుకే వీళ్ళిద్దరినీ నమ్మటం లేదా ?

జాతీయ స్ధాయిలో ఎన్టీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాన్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తూట్లు పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల అధినేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి ఐఎన్ఎల్డీ పార్టీ ఒక ప్రయత్నం జరిగింది. హర్యనాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, ర్యాలీ జరిగింది. జయంతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాల నేతలందరినీ ఐఎన్ఎల్డీ పిలిచింది.

అయితే ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి చాలామంది నేతలు హాజరైనా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణా సీఎం కేసీయార్ హాజరు కాలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే వీళ్ళిద్దరు గైర్హాజరైనట్లు అర్ధమైపోతోంది. కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా ప్రతిపక్షాల ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని బహిరంగ సభలో మాట్లాడిన నేతలంతా పదే పదే చెప్పారు. ఒక జాతీయ పార్టీ బీజేపీని ఎదుర్కోవాలంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ను కలుపుకుని పోవాల్సిందే అని బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గట్టిగా చెప్పారు.

ఇక్కడే మమత, కేసీయార్ కు సమస్య వస్తోంది. వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ తో కలిసి పని చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. శరద్ పవార్ తో భేటీలో కాంగ్రెస్ తో చేతులు కలపడానికి మమత ఇష్టపడినా మళ్ళీ ఎందుకనో ఈ కార్యక్రమంలో హాజరుకాలేదు. కాంగ్రెస్ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొనటం ఇష్టంలేకే వాళ్ళిద్దరు హాజరుకాలేదని అందరికీ అర్ధమైపోతోంది. కాబట్టి ఇదే విధమైన వైఖరిని ముందు ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంది.

మమత, కేసీయార్ కున్న లోకల్ సమస్యల కారణంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి ఇష్టపడటంలేదు. ఇంత స్పష్టంగా వీళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ అయినా ప్రజా ఫ్రంట్ అయినా ఎలా సక్సెస్ అవుతుందన్నది అసలు పాయింట్. ఇలాంటి కారణాలతోనే మమత, కేసీయార్ ను చాలా పార్టీలు నమ్మటం లేదు.

This post was last modified on September 26, 2022 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago