అదే అక్కసు.. అవే వ్యాఖ్యలు.. రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై.. వైసీపీ మంత్రుల వైఖరి ఏమాత్రం మారడంలేదు. మారేలా కూడా లేదు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ రైతుల యాత్ర గురించి.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. 10 వేల కోట్లు పెడితే ముంబయిని తలదన్నే నగరమవుతుందన్నారు.
కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని.. ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని.. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని.. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు.
ఇక, ఆది నుంచి కూడా మంత్రి బొత్స.. రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇక, పాదయాత్ర చేస్తున్న వారిపైనా.. ఆయన గతంలో వారంతా పెయిడ్ ఆర్టిస్టులు.. అంటూ.. నోరు పారేసుకున్నారు. బొత్స వ్యాఖ్యలపై అప్పట్లోనే రైతులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన దిష్టిబొమ్మను సైతం దహనం చేశారు. అయినా.. బొత్సలో ఎక్కడా మార్పు కనిపించకపోగా.. తాజాగా మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడంపై రైతులు మరోసారి ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానమే.. తమకు పాదయాత్ర చేసుకునే అవకాశం ఇచ్చిందన.. రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స వ్యాఖ్యలపై స్పందించిన రైతులు.. తాము ఎవరి దయాదాక్షిణ్యాలతో పాదయాత్ర చేయడం లేదని.. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఇచ్చిన అనుమతి మేరకు చేస్తున్నామని తెలిపారు. బొత్స చేసిన వ్యాఖ్యలపై.. కోర్టును ఆశ్రయించే విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చించి.. పరిశీలిస్తామని.. అమరావతి జేఏసీ నాయకులు తెలిపారు.
This post was last modified on September 25, 2022 10:06 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…