Political News

క‌న్నెర్ర చేస్తే.. యాత్ర‌లు ఆగిపోతాయ్‌: మంత్రి బొత్స

అదే అక్క‌సు.. అవే వ్యాఖ్య‌లు.. రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై.. వైసీపీ మంత్రుల వైఖ‌రి ఏమాత్రం మార‌డంలేదు. మారేలా కూడా లేదు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రైతుల యాత్ర గురించి.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. 10 వేల కోట్లు పెడితే ముంబయిని త‌ల‌ద‌న్నే నగరమవుతుందన్నారు.

కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి జరగాలన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని.. ఇది వాస్తవమని తెలిపారు. వైఎస్‌ జలయజ్ఞంతో తోటపల్లి, వంశధార ప్రాజెక్టులు వచ్చాయని.. ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని పేర్కొన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీ చేయాలని.. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు.

ఇక‌, ఆది నుంచి కూడా మంత్రి బొత్స‌.. రాజ‌ధానిపై ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఇక‌, పాద‌యాత్ర చేస్తున్న వారిపైనా.. ఆయ‌న గ‌తంలో వారంతా పెయిడ్ ఆర్టిస్టులు.. అంటూ.. నోరు పారేసుకున్నారు. బొత్స వ్యాఖ్య‌ల‌పై అప్ప‌ట్లోనే రైతులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయ‌న దిష్టిబొమ్మ‌ను సైతం ద‌హ‌నం చేశారు. అయినా.. బొత్స‌లో ఎక్క‌డా మార్పు క‌నిపించ‌క‌పోగా.. తాజాగా మ‌రింత రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యానించ‌డంపై రైతులు మ‌రోసారి ఆగ్ర‌హంవ్య‌క్తం చేస్తున్నారు.

న్యాయ‌స్థాన‌మే.. త‌మ‌కు పాద‌యాత్ర చేసుకునే అవ‌కాశం ఇచ్చింద‌న‌.. రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స వ్యాఖ్య‌ల‌పై స్పందించిన రైతులు.. తాము ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల‌తో పాద‌యాత్ర చేయ‌డం లేద‌ని.. రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ప‌రిధిలో ఇచ్చిన అనుమ‌తి మేర‌కు చేస్తున్నామ‌ని తెలిపారు. బొత్స చేసిన వ్యాఖ్య‌ల‌పై.. కోర్టును ఆశ్ర‌యించే విష‌యాన్ని న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించి.. ప‌రిశీలిస్తామ‌ని.. అమ‌రావ‌తి జేఏసీ నాయ‌కులు తెలిపారు.

This post was last modified on September 25, 2022 10:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago