Movie News

మంచి మార్పు దిశగా మల్టీప్లెక్సులు

ఇటీవలి నేషనల్ సినిమా డే పథకంలో భాగంగా 75 రూపాయలకే మల్టీప్లెక్సుల్లో టికెట్లు అమ్మడం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మల్టీ ప్లెక్సులు ఈ అవకాశాన్ని మరింత పొడిగించే నిర్ణయం తీసుకున్నాయి. ఒకే రోజు 65 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం చూసి సదరు యాజమాన్యాలు షాక్ తిన్నాయి. మధ్య తరగతి ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి లోపల ఇంటీరియర్ల దగ్గర సెల్ఫీలు దిగడం చూసి తాము మిడిల్ క్లాస్ ని ఎంత దూరం చేసుకున్నాయో అర్థం చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని వెసులుబాట్లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.

రేపటి నుంచి అంటే 26 నుంచి 29 దాకా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని అసోసియేషన్ లో భాగంగా ఉన్న మల్టీప్లెక్సులు థియేటర్లలో కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. నాలుగు రోజుల పాటు ఏ షో అయినా సరే ఇదే ధర ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కన్సెషన్ ఉండటం లేదు. ప్రభుత్వాలకు విన్నవించి లైసెన్సింగ్, ధరల విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఇలాంటి స్కీంలు అందుబాటులోకి తేవొచ్చు. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం మరో నాలుగు రోజులు పండగ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర రెండువందల ఏభై కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది.

ఈ ట్రెండ్ ని క్రమం తప్పకుండా కొనసాగించేందుకు ఇప్పుడీ సంస్థలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఒకటి రెండు వారాలయ్యాక స్లో అయిన సినిమాలకు ఇలాంటి ఆఫర్లు రెగ్యులర్ గా ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చలు చేస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ పోకడను ప్రోత్సహిస్తున్నారు. కేవలం వీకెండ్ ని నమ్ముకోకుండా మాములు రోజుల్లో కూడా థియేటర్లు నిండాలంటే ఇంత కంటే మంచి మార్గం లేదంటున్నారు. పైగా అన్నీ బ్రహ్మాస్త్రలాగా అడవు కాబట్టి డిజాస్టర్లకు సైతం అంతో ఇంతో రికవరీ రావాలంటే ఇలాంటివి చేయడం చాలా అవసరం. ఎటొచ్చి మన ఏపీ తెలంగాణలో కూడా తీసుకొస్తే బెటర్!

This post was last modified on September 25, 2022 4:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…

57 minutes ago

హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…

1 hour ago

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…

2 hours ago

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…

3 hours ago

అత్తరు సాయుబు బయటకు వచ్చాడు

ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో…

3 hours ago