Movie News

మంచి మార్పు దిశగా మల్టీప్లెక్సులు

ఇటీవలి నేషనల్ సినిమా డే పథకంలో భాగంగా 75 రూపాయలకే మల్టీప్లెక్సుల్లో టికెట్లు అమ్మడం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మల్టీ ప్లెక్సులు ఈ అవకాశాన్ని మరింత పొడిగించే నిర్ణయం తీసుకున్నాయి. ఒకే రోజు 65 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం చూసి సదరు యాజమాన్యాలు షాక్ తిన్నాయి. మధ్య తరగతి ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి లోపల ఇంటీరియర్ల దగ్గర సెల్ఫీలు దిగడం చూసి తాము మిడిల్ క్లాస్ ని ఎంత దూరం చేసుకున్నాయో అర్థం చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని వెసులుబాట్లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.

రేపటి నుంచి అంటే 26 నుంచి 29 దాకా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని అసోసియేషన్ లో భాగంగా ఉన్న మల్టీప్లెక్సులు థియేటర్లలో కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. నాలుగు రోజుల పాటు ఏ షో అయినా సరే ఇదే ధర ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కన్సెషన్ ఉండటం లేదు. ప్రభుత్వాలకు విన్నవించి లైసెన్సింగ్, ధరల విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఇలాంటి స్కీంలు అందుబాటులోకి తేవొచ్చు. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం మరో నాలుగు రోజులు పండగ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర రెండువందల ఏభై కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది.

ఈ ట్రెండ్ ని క్రమం తప్పకుండా కొనసాగించేందుకు ఇప్పుడీ సంస్థలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఒకటి రెండు వారాలయ్యాక స్లో అయిన సినిమాలకు ఇలాంటి ఆఫర్లు రెగ్యులర్ గా ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చలు చేస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ పోకడను ప్రోత్సహిస్తున్నారు. కేవలం వీకెండ్ ని నమ్ముకోకుండా మాములు రోజుల్లో కూడా థియేటర్లు నిండాలంటే ఇంత కంటే మంచి మార్గం లేదంటున్నారు. పైగా అన్నీ బ్రహ్మాస్త్రలాగా అడవు కాబట్టి డిజాస్టర్లకు సైతం అంతో ఇంతో రికవరీ రావాలంటే ఇలాంటివి చేయడం చాలా అవసరం. ఎటొచ్చి మన ఏపీ తెలంగాణలో కూడా తీసుకొస్తే బెటర్!

This post was last modified on September 25, 2022 4:32 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

12 mins ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

18 mins ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

33 mins ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

54 mins ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

1 hour ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

1 hour ago