ఇటీవలి నేషనల్ సినిమా డే పథకంలో భాగంగా 75 రూపాయలకే మల్టీప్లెక్సుల్లో టికెట్లు అమ్మడం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మల్టీ ప్లెక్సులు ఈ అవకాశాన్ని మరింత పొడిగించే నిర్ణయం తీసుకున్నాయి. ఒకే రోజు 65 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం చూసి సదరు యాజమాన్యాలు షాక్ తిన్నాయి. మధ్య తరగతి ఉద్యోగులు కుటుంబాలతో సహా వచ్చి లోపల ఇంటీరియర్ల దగ్గర సెల్ఫీలు దిగడం చూసి తాము మిడిల్ క్లాస్ ని ఎంత దూరం చేసుకున్నాయో అర్థం చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని వెసులుబాట్లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.
రేపటి నుంచి అంటే 26 నుంచి 29 దాకా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని అసోసియేషన్ లో భాగంగా ఉన్న మల్టీప్లెక్సులు థియేటర్లలో కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. నాలుగు రోజుల పాటు ఏ షో అయినా సరే ఇదే ధర ఉంటుంది. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ కన్సెషన్ ఉండటం లేదు. ప్రభుత్వాలకు విన్నవించి లైసెన్సింగ్, ధరల విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి సైతం ఇలాంటి స్కీంలు అందుబాటులోకి తేవొచ్చు. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం మరో నాలుగు రోజులు పండగ చేసుకోబోతున్నారు. బ్రహ్మాస్త్ర రెండువందల ఏభై కోట్ల మార్కుకు దగ్గరలో ఉంది.
ఈ ట్రెండ్ ని క్రమం తప్పకుండా కొనసాగించేందుకు ఇప్పుడీ సంస్థలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఒకటి రెండు వారాలయ్యాక స్లో అయిన సినిమాలకు ఇలాంటి ఆఫర్లు రెగ్యులర్ గా ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చలు చేస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ పోకడను ప్రోత్సహిస్తున్నారు. కేవలం వీకెండ్ ని నమ్ముకోకుండా మాములు రోజుల్లో కూడా థియేటర్లు నిండాలంటే ఇంత కంటే మంచి మార్గం లేదంటున్నారు. పైగా అన్నీ బ్రహ్మాస్త్రలాగా అడవు కాబట్టి డిజాస్టర్లకు సైతం అంతో ఇంతో రికవరీ రావాలంటే ఇలాంటివి చేయడం చాలా అవసరం. ఎటొచ్చి మన ఏపీ తెలంగాణలో కూడా తీసుకొస్తే బెటర్!
This post was last modified on September 25, 2022 4:32 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…