మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు.
అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత అసలు విషయం మెల్లిగా బయటపడుతోంది. రాజగోపాల్ చెప్పకున్నంతగా ఆయనకు సీన్ లేదట. ఎందుకంటే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే తన మద్దతుదారులంతా తనతో పాటే వచ్చేస్తారని కోమటిరెడ్డి చెప్పారట. అయితే చాలామంది నేతలు రాజగోపాల్ తో బీజేపీలోకి రాలేదు. తామంతా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని గట్టిగానే చెప్పారట. ఇదే సమయంలో ప్రచారానికి నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.
కాంగ్రెస్ పార్టీ మంచిగా చూసుకుంటున్న తర్వాత కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటు కొన్ని గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారట. అలాగే 2018 ఎన్నికల్లో పోటీచేసినపుడు ప్రభుత్వం చేయకపోతే తానే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల మొహాలే చూడలేదట. రాజీనామా చేసిన కారణంగా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పి నాలుగైదు గ్రామాల ప్రజలు మండిపోయారు.
రాజగోపాల్ ఏదో చెప్పబోయినా జనాలు ప్రచారం చేసుకోనియ్యలేదు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీ నేతలు తాజాగా 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేశారు. ప్రచారం, చేరికలు, ఎన్నికల వ్యూహాలు సమస్తం ఇదే కమిటి చూసుకుంటుందట. బీజేపీలో చేరకముందే ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని తానే చూసుకుంటానని రాజగోపాల్ చెప్పారట. ఆయన మాటవిని మొత్తం ఆయనకే వదిలేస్తే దెబ్బపడక తప్పదని అర్ధమైందట. అందుకనే 16 మందితో కమిటి వేశారు.
This post was last modified on September 25, 2022 10:53 am
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…