మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు.
అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత అసలు విషయం మెల్లిగా బయటపడుతోంది. రాజగోపాల్ చెప్పకున్నంతగా ఆయనకు సీన్ లేదట. ఎందుకంటే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే తన మద్దతుదారులంతా తనతో పాటే వచ్చేస్తారని కోమటిరెడ్డి చెప్పారట. అయితే చాలామంది నేతలు రాజగోపాల్ తో బీజేపీలోకి రాలేదు. తామంతా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని గట్టిగానే చెప్పారట. ఇదే సమయంలో ప్రచారానికి నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.
కాంగ్రెస్ పార్టీ మంచిగా చూసుకుంటున్న తర్వాత కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటు కొన్ని గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారట. అలాగే 2018 ఎన్నికల్లో పోటీచేసినపుడు ప్రభుత్వం చేయకపోతే తానే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల మొహాలే చూడలేదట. రాజీనామా చేసిన కారణంగా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పి నాలుగైదు గ్రామాల ప్రజలు మండిపోయారు.
రాజగోపాల్ ఏదో చెప్పబోయినా జనాలు ప్రచారం చేసుకోనియ్యలేదు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీ నేతలు తాజాగా 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేశారు. ప్రచారం, చేరికలు, ఎన్నికల వ్యూహాలు సమస్తం ఇదే కమిటి చూసుకుంటుందట. బీజేపీలో చేరకముందే ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని తానే చూసుకుంటానని రాజగోపాల్ చెప్పారట. ఆయన మాటవిని మొత్తం ఆయనకే వదిలేస్తే దెబ్బపడక తప్పదని అర్ధమైందట. అందుకనే 16 మందితో కమిటి వేశారు.
This post was last modified on September 25, 2022 10:53 am
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…
షాకింగ్ విషాద ఉదంతం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు తెలంగాణ…