Political News

మునుగోడు కోసం ప్రత్యేకంగా కమిటి

మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు.

అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత అసలు విషయం మెల్లిగా బయటపడుతోంది. రాజగోపాల్ చెప్పకున్నంతగా ఆయనకు సీన్ లేదట. ఎందుకంటే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే తన మద్దతుదారులంతా తనతో పాటే వచ్చేస్తారని కోమటిరెడ్డి చెప్పారట. అయితే చాలామంది నేతలు రాజగోపాల్ తో బీజేపీలోకి రాలేదు. తామంతా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని గట్టిగానే చెప్పారట. ఇదే సమయంలో ప్రచారానికి నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.

కాంగ్రెస్ పార్టీ మంచిగా చూసుకుంటున్న తర్వాత కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటు కొన్ని గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారట. అలాగే 2018 ఎన్నికల్లో పోటీచేసినపుడు ప్రభుత్వం చేయకపోతే తానే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల మొహాలే చూడలేదట. రాజీనామా చేసిన కారణంగా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పి నాలుగైదు గ్రామాల ప్రజలు మండిపోయారు.

రాజగోపాల్ ఏదో చెప్పబోయినా జనాలు ప్రచారం చేసుకోనియ్యలేదు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీ నేతలు తాజాగా 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేశారు. ప్రచారం, చేరికలు, ఎన్నికల వ్యూహాలు సమస్తం ఇదే కమిటి చూసుకుంటుందట. బీజేపీలో చేరకముందే ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని తానే చూసుకుంటానని రాజగోపాల్ చెప్పారట. ఆయన మాటవిని మొత్తం ఆయనకే వదిలేస్తే దెబ్బపడక తప్పదని అర్ధమైందట. అందుకనే 16 మందితో కమిటి వేశారు.

This post was last modified on September 25, 2022 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

26 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago