మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు.
అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత అసలు విషయం మెల్లిగా బయటపడుతోంది. రాజగోపాల్ చెప్పకున్నంతగా ఆయనకు సీన్ లేదట. ఎందుకంటే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే తన మద్దతుదారులంతా తనతో పాటే వచ్చేస్తారని కోమటిరెడ్డి చెప్పారట. అయితే చాలామంది నేతలు రాజగోపాల్ తో బీజేపీలోకి రాలేదు. తామంతా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని గట్టిగానే చెప్పారట. ఇదే సమయంలో ప్రచారానికి నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.
కాంగ్రెస్ పార్టీ మంచిగా చూసుకుంటున్న తర్వాత కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటు కొన్ని గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారట. అలాగే 2018 ఎన్నికల్లో పోటీచేసినపుడు ప్రభుత్వం చేయకపోతే తానే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల మొహాలే చూడలేదట. రాజీనామా చేసిన కారణంగా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పి నాలుగైదు గ్రామాల ప్రజలు మండిపోయారు.
రాజగోపాల్ ఏదో చెప్పబోయినా జనాలు ప్రచారం చేసుకోనియ్యలేదు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీ నేతలు తాజాగా 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేశారు. ప్రచారం, చేరికలు, ఎన్నికల వ్యూహాలు సమస్తం ఇదే కమిటి చూసుకుంటుందట. బీజేపీలో చేరకముందే ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని తానే చూసుకుంటానని రాజగోపాల్ చెప్పారట. ఆయన మాటవిని మొత్తం ఆయనకే వదిలేస్తే దెబ్బపడక తప్పదని అర్ధమైందట. అందుకనే 16 మందితో కమిటి వేశారు.
This post was last modified on September 25, 2022 10:53 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…